PM Modi: వీరులారా వందనం.. ప్రధాని మోదీ ఎమోషనల్ స్పీచ్

పంజాబ్‌లోని ఆదంపుర్‌ ఎయిర్‌బేస్‌లో ప్రధాని మోదీ ప్రసంగించారు. సైనికులు చరిత్ర సృష్టించారంటూ కొనియాడారు. పాక్ అణుబాంబు హెచ్చరికలను భారత సైన్యం చిత్తు చేసిందన్నారు. 

New Update

ప్రధాని మోదీ మంగళవారం పంజాబ్‌లోని ఆదంపుర్‌ ఎయిర్‌బేస్‌ను సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఎయిర్‌ఫోర్స్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. సైనికులు చరిత్ర సృష్టించారంటూ కొనియాడారు. పాక్ అణుబాంబు హెచ్చరికలను భారత సైన్యం చిత్తు చేసిందన్నారు. '' ఆపరేషన్ సిందూర్ సాధారణమైన విన్యాసం కాదు. వారు వెనుక నుంచి దాడులు చేస్తే.. మీరు ఎదురుగా నిలబడి పోరాడారు. ఉగ్రవాద స్థావరాలను మట్టిలో కలిపారు. భారత వాయుసేన ప్రతిభను చూసి ప్రపంచమే ఆశ్చర్యపోతుంది. 

Also Read: అది చేయకుంటే కాల్పుల విరమణ ఆగిపోతుంది.. భారత్‌ను హెచ్చరించిన పాక్

మన మహిళల సిందూరాన్ని దూరం చేసిన వాళ్ల ఇళ్లల్లోకి వెళ్లి దాడి చేశాం. పౌరులకు ఎలాంటి నష్టం జరగకుండా శత్రువును చావుదెబ్బ కొట్టాం. వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఎంతో కచ్చితత్వంతో, నైపుణ్యంతో చేసిన దాడి ఇది. పాక్ అణ్వాయుధాలు చూపి బ్లాక్‌మెయిల్ చేయాలనుకున్నారు. కానీ అణుబాంబు హెచ్చరికను భారత్‌ చిత్తు చేసింది. ఇది భారత్ నీతి, నియమం, నిర్ణయానికి నిదర్శనం. ఈ దేశం గురుగోవింద్ సింగ్‌కు చెందినది. అవసరమైతే ధర్మస్థాపనకు ఆయుధాలు వాడటం మన సంప్రదాయం. 

Also Read: ఒక్క ఫొటోతో పాకిస్థాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చిన మోదీ..

మళ్లీ ఉగ్రదాడి జరిగితే భారత్‌ కచ్చితంగా సమాధానం ఇస్తుంది. సర్జికల్ స్ట్రైక్, ఎయిర్‌ స్ట్రైక్‌ సమయాల్లో దీన్ని నిరూపించాం. తాజాగా ఆపరేషన్ సిందూర్‌తో దాన్ని మరోసారి స్పష్టం చేశాం. భారత్‌ మాతా కీ జై అనే నినాదం ప్రపంచమంతటా వినిపిస్తోంది. మన డ్రోన్స్, మిసైల్స్‌ పాకిస్థాన్‌ సైన్యానికి నిద్ర లేకుండా చేశాయి. మళ్లీ ఉగ్రదాడి జరిగితే భారత్‌ కచ్చితంగా సమాధానం ఇస్తుంది. సర్జికల్ స్ట్రైక్, ఎయిర్‌ స్ట్రైక్‌ సమయాల్లో దీన్ని నిరూపించాం. తాజాగా ఆపరేషన్ సిందూర్‌తో దాన్ని మరోసారి స్పష్టం చేశాం. భారత్‌ మాతా కీ జై అనే నినాదం ప్రపంచమంతటా వినిపిస్తోంది. మన డ్రోన్స్, మిసైల్స్‌ పాకిస్థాన్‌ సైన్యానికి నిద్ర లేకుండా చేశాయి. భారత్ ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్‌కు సెల్యూట్‌. ప్రతి భారతీయుడు మీ వెంట ఉన్నాడని'' ప్రధాని మోదీ అన్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు