పాక్లో న్యూక్లియర్ ఎమర్జెన్సీ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. భారత్ ఆర్మీ ఎటాక్ చేసిన సర్గోదా ఎయిర్ బేస్ సమీపంలో కిరానాహిల్స్ ఉన్నాయి. ఈ కిరానాహిల్స్లో పాకిస్తాన్ అణ్వాయుధాలు దాచి ఉంచిందని తెలుస్తోంది. భారత్ దాడి నేపథ్యంలో అణు వాయువులు లీక్ అవుతున్నట్లుగా సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. అణు వాయువులు లీక్ అవుతుండటంతో పాక్ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై సమీప గ్రామాల ప్రజలను ఖాళీ చేయిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి. గ్యాస్ లీకేజీ ఎక్కువైతే భారీ విస్పోటనం తప్పదని సైంటిస్టులు అంటున్నారు. పాకిస్తాన్ కోసం అమెరికా అణు శాస్త్రవేత్తలు రంగంలోకి దిగారు. ఈజిప్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బోరాన్ 10 కెమికల్ ను పాక్ కు తరలిస్తు్న్నట్లుగా సమాచారం. బోరాన్ 10 ను ఎక్కడైనా అణుప్రమాదం జరిగితే రెడియేషన్ యాక్టివిటీని తగ్గించడానికి దీనిని ఉపయోగిస్తారు. అణు రేడియేషన్ స్థిరీకరణలో కీలకంగా బోరాన్ 10 ను ఉపయోగిస్తారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై పాక్ మౌనంగా ఉంటుంది కానీ దీనిపై నోరు విప్పడం లేదు.
pakistan | india | Nuclear Bomb Emergency | telugu-news