Jammu and Kashmir Encounter:  జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు లష్కరే ఉగ్రవాదులు హతం..!

షోపియన్‌లోని జిన్‌పథర్ కెల్లర్ ప్రాంతంలో మంగళవారం ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక లష్కరే తోయిబా ఉగ్రవాది మృతి చెందాడు.  మరో ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు  భద్రతా దళాలకు మధ్య ప్రస్తుతం కాల్పులు జరుగుతున్నాయి.

author-image
By Krishna
New Update
jammui-encounter

jammui-encounter

Jammu and Kashmir Encounter: ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడి(Pahalgam Terror Attack) తర్వాత భారత్(India), పాకిస్తాన్(Pakistan)  దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాక్ ఉగ్రదాడికి ధీటుగా భారత్..ఆపరేషన్ సిందూర్ పేరిట(Operation Sindoor) పాకిస్తాన్, పాకిస్తాన్ అక్రమ కశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరలపై వైమానిక దాడులు చేసి దాదాపు వందమంది ఉగ్రవాదలను హతం చేసింది.

Also Read: కాల్పుల విరమణలో వీళ్లే కీలకం.. ఇరు దేశాల DGMO గురించి మీకు తెలుసా?

జమ్మూకశ్మీర్‌లో ఎదురుకాల్పులు

తాజాగా దక్షిణ జమ్మూకశ్మీర్‌లో ఎదురుకాల్పులు జరిగాయి. షోపియన్‌లోని జిన్‌పథర్ కెల్లర్ ప్రాంతంలో మంగళవారం ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో ఇద్దరు ఉగ్రవాదులు కూడా పట్టుబడినట్లు తెలుస్తోంది. ఆ ఉగ్రవాదులు లష్కరే తోయిబా(Lashkar Terrorists) గ్రూప్‌నకు చెందినవారిగా తెలుస్తోంది.  ఉగ్రవాదులు భద్రతా దళాలకు మధ్య ప్రస్తుతం కాల్పులు జరుగుతున్నాయి. 

Also Read: కాల్పుల విరమణ తర్వాత మోదీ ఫస్ట్ ట్వీట్.. ఏమన్నారంటే?

పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడికి కారణమైన వారిపై సమాచారం ఇచ్చిన వారికి రూ.20 లక్షల రివార్డును ప్రకటిస్తూ పుల్వామా జిల్లా అంతటా పోస్టర్లు వెలిసిన కొన్ని గంటల తర్వాత ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ముందుగా కుల్గాం ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి.

Also Read: మీడియా ముందు బయటపడ్డ దొంగ పాక్.. పుల్వామా అటాక్‌ కూడా మేమే

Advertisment
Advertisment
తాజా కథనాలు