PM Modi: ఒక్క ఫొటోతో పాకిస్థాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చిన మోదీ..

ప్రధాని మోదీ మంగళవారం పంజాబ్‌లోని ఆదంపుర్‌ ఎయిర్‌బేస్‌ను సందర్శించారు. ఆయన దిగిన ఫొటో వెనుక " శత్రు పైలట్లు ఎందుకు ప్రశాంతంగా నిద్రపోరు'' అని రాసి ఉంది. దీన్నిబట్టి ఆయన శత్రు దేశానికి గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు కనిపిస్తోంది.

New Update
PM Modi

PM Modi

ప్రధాని మోదీ మంగళవారం పంజాబ్‌లోని ఆదంపుర్‌ ఎయిర్‌బేస్‌ను సందర్శించిన సంగతి తెలిసిందే. అక్కడి సైనికులతో ఆయన మాట్లాడి పలు విషయాలు పంచుకున్నారు. ఆపరేషన్ సిందూర్, భారత్-పాక్‌ కాల్పుల విరమణకు అంగీకరించిన తర్వాత ప్రధాని మోదీ.. సైనికులను కలకవడం ప్రాధాన్యం సంతరించుకుంది. దాదాపు గంటకుపైగా సైనికులతో ఆయన గడిపారు. ప్రధాని ముందు సైనికులు భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. 

PM Modi Pic Gives Clear Message To Enemies

Also Read: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు లష్కరే ఉగ్రవాదులు హతం..!

ప్రధాని మోదీ సైనికులతో కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ప్రధాని దిగిన ఒక ఫొటో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆ ఫొటోలో ఆయన శత్రు దేశానికి గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. ప్రధాని దిగిన ఫొటో వెనుక " శత్రు పైలట్లు ఎందుకు ప్రశాంతంగా నిద్రపోరు'' అని రాసి ఉంది. దాని కింద MIG-29 ఫైటర్ జెట్ చిత్రం కూడా ఉంది. దీన్ని బట్టి చూస్తే ప్రధాని ఈ ఫొటోతో శత్రుదేశానిక గట్టి వార్నింగ్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

Also Read: 11 మంది పాక్ సైనికులు హతం.. 78 మందికి గాయాలు!

మరోవైపు ప్రధాని మోదీ ఎక్స్‌లో ఆదంపూర్ ఎయిర్‌బేస్‌ను సందర్శించిన ఫొటోలు చేశారు. దేశ రక్షణ కోసం బలగాలు చేపట్టే ప్రతిచర్యకు ప్రజలు ఎప్పటికీ కృతజ్ఞతలో ఉంటారని రాసుకొచ్చారు. ఇదిలాఉండగా ఆపరేషన్ సిందూర్ గురించి ప్రధాని.. దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన మరుసటి రోజే ఈ పర్యటనకు వెళ్లారు. 

Also Read :  తండ్రీకొడుకును బలితీసుకున్న ఆన్ లైన్ బెట్టింగ్.. ఒకరికోసం మరొకరు దారుణం!

Also Read :  ఊరమాస్.. శాంసంగ్ నుంచి 200MP కెమెరా ఫోన్ - ఫీచర్లు పిచ్చ క్లాస్!

 

national news in Telugu | latest-telugu-news | today-news-in-telugu | breaking news in telugu

Advertisment
Advertisment
తాజా కథనాలు