/rtv/media/media_files/2025/05/13/XsFdb5dveYI837oLbaaQ.jpg)
India asked a Pakistani embassy official to leave India with immediate effect on charges of espionage
భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ అధికారికి కేంద్రం నోటీసులు జారీ చేసింది. వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. దౌత్యపరంగా ఉన్న విషయాల్లో అతడు కలగజేసుకోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ అధికారి భారత సైన్యానికి సంబంధించిన కదలికలను లీక్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆన్లైన్లో అనుమానిత లావాదేవీలు గుర్తించారు. ఈ క్రమంలోనే కేంద్రం ఆ అధికారిని 'ఆమోదింపని వ్యక్తి' గా ప్రకటించింది. 24 గంటల్లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది.
Also Read: ఇదేం ట్విస్ట్ మామా.. 7వ అడుగు వేస్తుండగా పెళ్లి రద్దు చేసుకున్న యువకుడు!
ఇదిలాఉండగా ఆపరేషన్ సిందూర్, కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ప్రధాని మోదీ మంగళవారం పంజాబ్లోని ఆదంపుర్ ఎయిర్బేస్ను సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఎయిర్ఫోర్స్ను ఉద్దేశించి ప్రసంగించారు. సైనికులు చరిత్ర సృష్టించారంటూ కొనియాడారు. పాక్ అణుబాంబు హెచ్చరికలను భారత సైన్యం చిత్తు చేసిందన్నారు.
Also Read: అలాంటి పదవులేవి నాకొద్దు.. CJI సంజీవ్ ఖన్నా ఆసక్తికర వ్యాఖ్యలు
మన మహిళల సిందూరాన్ని దూరం చేసిన వాళ్ల ఇళ్లల్లోకి వెళ్లి దాడి చేశాం. పౌరులకు ఎలాంటి నష్టం జరగకుండా శత్రువును చావుదెబ్బ కొట్టాం. వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఎంతో కచ్చితత్వంతో, నైపుణ్యంతో చేసిన దాడి ఇది.పాక్ అణ్వాయుధాలు చూపి బ్లాక్మెయిల్ చేయాలనుకున్నారు. కానీ అణుబాంబు హెచ్చరికను భారత్ చిత్తు చేసింది. మళ్లీ ఉగ్రదాడి జరిగితే భారత్ కచ్చితంగా సమాధానం ఇస్తుంది. సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ స్ట్రైక్ సమయాల్లో దీన్ని నిరూపించాం. తాజాగా ఆపరేషన్ సిందూర్తో దాన్ని మరోసారి స్పష్టం చేశామని'' అన్నారు.
embassy | rtv-news