/rtv/media/media_files/2025/05/12/YRm40Pnxh9rZJVmRw3jQ.jpg)
కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత పాకిస్తాన్ మరో సారి ఉల్లంఘనకు పాల్పడింది. మా జోలికి వస్తే వైమానికి దాడులు చేస్తామని చేసి చూపించినా పాక్ తన వక్ర బుద్ధిని మరవలేకపోతుంది. జమ్మూ కాశ్మీర్లోని సాంబా సెక్టార్లో సోమవారం రాత్రి 15 నిమిషాల పాటు డ్రోన్లతో పాకిస్తాన్ అటాక్ చేసింది. భారత్ పాక్ డ్రోన్లను తిప్పికొట్టింది. గగనతలంలోనే పాకిస్తాన్ డ్రోన్లను కుప్పకూల్చింది ఇండియ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. బ్లాక్అవుట్ అమలు చేసి డ్రోన్లను కూల్చివేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
#UPDATE: After the first wave of drone activity and Air Defence fire. Now, No drone activity observed for the past 15 minutes in Samba. https://t.co/wsJnadZGvx
— ANI (@ANI) May 12, 2025
శనివారం ఇరు దేశాలు కాల్పుల విరమణపై ఒప్పందం కుదుర్చుకున్న పాకిస్తాన్ మాత్రం తురుచూ కాల్పలు, డ్రోన్ అటాక్లకు పాల్పడుతుంది. అదే రోజు ఒప్పందాన్ని గాలికి వదిలేసి భారత్పై కాల్పులకు పాల్పడింది. వెంటనే అప్రమత్తమైన ఇండియన్ ఆర్మీ సాంబా సెక్టార్ ప్రాంతంలో బ్లాక్అవుట్ ప్రకటించింది. పాకిస్తాన్ డ్రోన్ డాడులను విజయవంతంగా తిప్పికొట్టింది. కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత పాకిస్తాన్ ఉల్లంఘనకు పాల్పడటం ఇది రెండోసారి. పాక్ వంకర బుద్ధికి భారత్ ధీటుగానే సమాధానం చెబుతోంది.
(Jammu and Kashmir | Samba sector | pakistan | india pak ceasefire | india pak ceasefire news | india pak war | pakistan drone attack | latest-telugu-news)