ఆపరేషన్ సిందూర్కు ప్రతీకారంగా పాకిస్తాన్ ఆర్మీ ఇండియాలో పౌరులపై దాడులు చేయడానికి ప్రయత్నించింది. వాటిని ఇండియా ఎయిర్ డిఫెన్స్ విజయవంతంగా అడ్డుకుంది. అయితే దానికి ప్రతిదాడులుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్లోని ఎయిర్ పోర్టులు, పాక్ ఎయిర్ బేస్లపై అటాక్ చేసింది.
Indian Armed Forces share footage showing aftermath of Pakistan's Rahimyar Khan Airbase after India hit back
— The Indian Express (@IndianExpress) May 12, 2025
Air Marshal A K Bharti highlighted the "massive crater at the runway." pic.twitter.com/sLlSBqgUBD
ప్రస్తుతం పాకిస్తాన్లో దాడికి గురైన ఎయిర్ పోర్టులు, ఎయిర్ బేస్ల శాటిలైట్ ఫొటోలు రిలీజ్ చేశారు. అందులో పూర్తిగా ధ్వంసమైన రన్వేలను చూడవచ్చు. భారత్ దెబ్బకు దుగ్గు దుగ్గైన పాక్ ఎయిర్ బేస్ల ఫొటోలు, రన్ వేల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సర్గోధాలోని పాక్ ఎయిర్ ఫోర్స్ శిభిరం రన్వే దుగ్గు దుగ్గు అయ్యింది. అలాగే సుక్కూర్లో బిల్డింగ్ కూడా దెబ్బతిన్నది. రహీమ్ యార్ ఖాన్ ఎయిర్ బేస్ రన్ వేపై పెద్ద పెద్ద గోతులు పడ్డాయి. ప్రస్తుతం అది పని చేయకుండా పోయింది. హై రెసల్యూషన్ ఇమేజ్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Rahim Yar Khan #Airport #Pakistan
— Ninjamonkey 🇮🇳 (@Aryan_warlord) May 10, 2025
Runway can be seen with major damage . pic.twitter.com/SwpB3vrviz
దీంతో ధ్వంసమైన ఎయిర్ పోర్టులు, ఎయిర్ బేస్ల దగ్గర పాకిస్తాన్ ఎమర్జెన్సీ విధించింది. మరమత్తులు నిర్వహిస్తున్నారు.
(pakistan airport blast | Pakistan Air Base | ATTACK On Pakistan Air Base | india destroyed pakistan air defence in lahore | pakistan air defence system | india pak war | Indian Air Force | latest-telugu-news)