పాక్ ఎయిర్ బేస్‌‌లను నాశనం చేసిన ఇండియా.. ఫొటోలు వచ్చాయ్ చూడండి

భారత్ వైమానికి దాడుల్లో పాకిస్తాన్ ఎయిర్ బేస్‌, రన్ వేలు ధ్వంసమైయ్యాయి. క్లియర్ శాటిలైట్ ఇమేజ్‌లు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సర్గోధా, హీమ్ యార్ ఖాన్, లాహోర్‌లో IAF విధ్వంసం సృష్టించింది. పాక్ ఎయిర్ బేస్‌లను ఇండియా దుగ్గు దుగ్గు చేసింది.

New Update

ఆపరేషన్ సిందూర్‌కు ప్రతీకారంగా పాకిస్తాన్ ఆర్మీ ఇండియాలో పౌరులపై దాడులు చేయడానికి ప్రయత్నించింది. వాటిని ఇండియా ఎయిర్ డిఫెన్స్ విజయవంతంగా అడ్డుకుంది. అయితే దానికి ప్రతిదాడులుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్‌లోని ఎయిర్ పోర్టులు, పాక్ ఎయిర్ బేస్‌లపై అటాక్ చేసింది.

ప్రస్తుతం పాకిస్తాన్‌లో దాడికి గురైన ఎయిర్ పోర్టులు, ఎయిర్ బేస్‌ల శాటిలైట్ ఫొటోలు రిలీజ్ చేశారు. అందులో పూర్తిగా ధ్వంసమైన రన్‌వేలను చూడవచ్చు. భారత్ దెబ్బకు దుగ్గు దుగ్గైన పాక్ ఎయిర్ బేస్‌ల ఫొటోలు, రన్ వేల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సర్గోధాలోని పాక్ ఎయిర్ ఫోర్స్ శిభిరం రన్‌వే దుగ్గు దుగ్గు అయ్యింది. అలాగే సుక్కూర్‌లో బిల్డింగ్ కూడా దెబ్బతిన్నది. రహీమ్ యార్ ఖాన్ ఎయిర్ బేస్ రన్ వేపై పెద్ద పెద్ద గోతులు పడ్డాయి. ప్రస్తుతం అది పని చేయకుండా పోయింది. హై రెసల్యూషన్ ఇమేజ్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దీంతో ధ్వంసమైన ఎయిర్ పోర్టులు, ఎయిర్ బేస్‌ల దగ్గర పాకిస్తాన్ ఎమర్జెన్సీ విధించింది. మరమత్తులు నిర్వహిస్తున్నారు.

(pakistan airport blast | Pakistan Air Base | ATTACK On Pakistan Air Base | india destroyed pakistan air defence in lahore | pakistan air defence system | india pak war | Indian Air Force | latest-telugu-news)

Advertisment
Advertisment
తాజా కథనాలు