IPL ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్ రిలీజ్ చేసిన BCCI

మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్‌ బీసీసీఐ ఈరోజు విడుదల చేసింది. మే 17 IPL పునఃప్రారంభం కానుంది. మిగిలిన 17 మ్యాచ్‌లను ఆరు స్టేడియాల్లో నిర్వహించనున్నట్లు ప్రకటచింది. జూన్ 3న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ల షెడ్యూల్ చేశారు.

New Update
ipl

ఐపీఎల్ లవర్స్‌కు బీసీసీఐ శుభవార్త చెప్పింది. ఇండియా, పాక్ ఉద్రిక్తతల కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మధ్యలోనే వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్‌ బీసీసీఐ సోమవారం విడుదల చేసింది. మే 17 నుంచి IPL పునఃప్రారంభం కానుంది. మిగిలిన 17 మ్యాచ్‌లను ఆరు స్టేడియాల్లో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. జూన్ 3న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ల షెడ్యూల్ చేశారు.

భారత్‌పై పాకిస్తాన్ దాడులకు పాల్పడుతుండగా ఐపీఎల్ మధ్యలోనే వాయిదా వేశారు. ఇటీవల ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోగా టోర్నమెంట్‌ను మళ్లీ స్టార్ట్ చేస్తున్నట్లు తెలిపింది. ఇక త్వరలోనే ఐపీఎల్ హవా కొనసాగనుంది. బెంగుళూరు, జైపూర్, ఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై, లక్నోలోని స్టేడియంలో మిగిలిన IPL 2025 మ్యాచ్‌లను తిరిగి నిర్వహించనున్నారు.

(ipl-17-season | latest-telugu-news | cricket | ipl-season)

Advertisment
Advertisment
తాజా కథనాలు