/rtv/media/media_files/2024/11/24/AfgkTrsl1EA6iAo6w4fD.jpg)
ఐపీఎల్ లవర్స్కు బీసీసీఐ శుభవార్త చెప్పింది. ఇండియా, పాక్ ఉద్రిక్తతల కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మధ్యలోనే వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే మిగిలిన మ్యాచ్ల షెడ్యూల్ బీసీసీఐ సోమవారం విడుదల చేసింది. మే 17 నుంచి IPL పునఃప్రారంభం కానుంది. మిగిలిన 17 మ్యాచ్లను ఆరు స్టేడియాల్లో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. జూన్ 3న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ల షెడ్యూల్ చేశారు.
The updated schedule for the remainder of the TATA IPL 2025. A total of 17 matches will be played across 6 venues, starting May 17, and culminating in the final on June 3.
— ANI (@ANI) May 12, 2025
(Pic: BCCI) pic.twitter.com/dYhb5BeBV0
భారత్పై పాకిస్తాన్ దాడులకు పాల్పడుతుండగా ఐపీఎల్ మధ్యలోనే వాయిదా వేశారు. ఇటీవల ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోగా టోర్నమెంట్ను మళ్లీ స్టార్ట్ చేస్తున్నట్లు తెలిపింది. ఇక త్వరలోనే ఐపీఎల్ హవా కొనసాగనుంది. బెంగుళూరు, జైపూర్, ఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై, లక్నోలోని స్టేడియంలో మిగిలిన IPL 2025 మ్యాచ్లను తిరిగి నిర్వహించనున్నారు.
(ipl-17-season | latest-telugu-news | cricket | ipl-season)