Pakistan: పాక్ అణ్వాయుధాలపై దాడి జరిగితే.. ఏమవుతుందో తెలుసా?

పాకిస్తాన్‌ కిరానా హిల్స్‌‌లో అణ్వాయుధాలు ఉన్న విషయం తెలిసిందే. వీటిపై బ్రహ్మోస్ వంటి క్షిపణులతో దాడులు చేసినా అణు బాంబు విస్ఫోటనం చెందదు. దీని చూట్టూ ఉన్న ప్రాంతానికి భారీగా నష్టం వాటిల్లుతుంది. బలమైన కాంక్రీట్‌ మధ్యలో నిల్వ చేయడం వల్ల విస్ఫోటనం చెందవట.

New Update
Kirana Hills in Pakistan

Kirana Hills in Pakistan

ఇండియా, పాక్ మధ్య ఘర్షణల తర్వాత పాకిస్తాన్‌లోని కిరానా హిల్స్‌ ప్రస్తావన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని సర్గోడా జిల్లాలో కిరానా కొండలు ఉన్నాయి. రిజర్వ్ ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన ఈ గుహలను బలమైన కాంక్రీట్‌తో తయారు చేసి పాక్ అందులో అణ్వాయుధాలను నిల్వ చేసినట్లు సమాచారం. అయితే పాక్‌పై భారత్ దాడి చేసినప్పుడు వాటిపైన కూడా దాడి చేసిందని వార్తలు వచ్చాయి. వీటిని పాక్ కొట్టిపారేసింది. అయితే పాక్ నిల్వ ఉంచిన ఈ అణ్వాయుధాలపై క్షిపణి దాడి జరిగితే ఏమవుతుందో మీకు తెలుసా?

ఇది కూడా చూడండి: BIG BREAKING: అణు బాంబు వేస్తామని పాక్ బెదిరిస్తే సహించం.. మోదీ స్ట్రాంగ్ వార్నింగ్

బ్రహ్మోస్ క్షిపణితో దాడి చేసినా..

సాధారణంగా ఈ అణ్వాయుధాలను సూపర్ హై సెక్యూరిటీలో నిల్వ ఉంచుతారు. వీటిని హార్డెన్డ్ అండర్ గ్రౌండ్ బంకర్లు లేదా స్పెషల్ వెపన్ స్టోరేజ్ ఏరియాస్ అని కూడా అంటారు. అయితే ఈ అణ్వాయుధాలపై ఎంత పెద్ద శక్తి ఉన్న పేలుడు క్షిపణి పడినా కూడా అణ్వాయుధాలకు ఏం కాదు. సాధారణ పేలుడుతో ఈ అణుబాంబు విస్ఫోటనం చెందదు. ఎలక్ట్రానిక్, విస్ఫోటన కోడ్ ద్వారా అణ్వాయుధాలను భద్రపరుస్తారు. ఈ కారణంగానే అణ్వాయుధాలకు ఏం కాదు. ఒకవేళ బ్రహ్మోస్ వంటి క్షిపణులతో దాడి చేస్తే ఆ ప్రాంతంలో భారీ నష్టం జరుగుతుంది. కానీ అణు విస్ఫోటనం మాత్రం జరగదట. 

ఇది కూడా చూడండి: IPL ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్ రిలీజ్ చేసిన BCCI

ఇదిలా ఉండగా పాక్, భారత్ వార్‌తో ఈ కిరానా హిల్స్ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కొండల్లోనే పాకిస్థాన్‌ అణువార్‌ హెడ్లను దాచిందనే ప్రచారముంది. ఈ కొండల్లో చాలా సొరంగాలు ఉన్నాయని వాటిల్లోనే పాక్‌ తన అణ్వాయుధాలను దాచిందని చెప్తారు. అయితే భారత్‌ అపరేషన్‌ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్ లోని రఫీకి, మురిద్, నూర్ ఖాన్, రహీమ్ యార్ ఖాన్, సుక్కూర్, చునియన్, పస్రూర్, సియాల్‌కోట్‌లలోని కీలకమైన వైమానిక స్థావరాలతో సహా 11 సైనిక స్థావరాలపై దాడి చేసింది. 

ఇది కూడా చూడండి: పాకిస్థాన్‌ కిరానా హిల్స్‌లో రహస్యం.. ఆర్మీ చేతికి చిక్కిన సమాచారం..!

అంతేకాదు పాకిస్థాన్‌కు కీలకమైన రావల్పిండి లోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌పై కూడా దాడి చేసింది. నూర్ ఖాన్ ఎయిర్‌ బేస్‌ పాకిస్తాన్ అణ్వాయుధ సామగ్రిని పర్యవేక్షించే సంస్థ అయిన వ్యూహాత్మక ప్రణాళికల విభాగానికి చెందిన ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉంది. అయితే ఈ సందర్భంలో కిరాణా హిల్స్‌ ప్రస్తావన మాత్రం రాలేదు.

Advertisment
Advertisment
తాజా కథనాలు