/rtv/media/media_files/2025/05/13/886ssxxmCy6Now8Q43yj.jpg)
India Pakistan War 2025: ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడికి(Pahalgam Terror Attack) కౌంటర్ గా భారత్ ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) పేరిట ఆపరేషన్ చేపట్టి పాకిస్తాన్, పాకిస్తాన్ అక్రమ కశ్మీర్(POK) లోని ఉగ్రవాద స్థావరలపై(Terrorist Bases) వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో దాదాపు వందమందికి పైగా ఉగ్రవాదలను హతం చేసింది. భారత్ జరిపిన ప్రతీకార చర్యలో తమ సైనికులు11 మంది మృతి చెందగా 78 మంది గాయాలయ్యాని పాక్ ఆర్మీ వెల్లడించింది. అంతేకాకుండా మరో 40 మంది పౌరులు మృతి చెందారని, 121 మందికి గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. దీనితో పాటు, భారత క్షిపణి దాడుల్లో పాకిస్తాన్ వైమానిక దళం కూడా భారీ నష్టాలను చవిచూసిందని పాకిస్తాన్ అంగీకరించింది.
Also Read: మీడియా ముందు బయటపడ్డ దొంగ పాక్.. పుల్వామా అటాక్ కూడా మేమే
#BREAKING
— The Diplomacy (@diplomacy4user) May 13, 2025
Pakistan finally admits that 11 Pakistani Military personnel were killed (6 Pakistan Army soldiers and 5 Pakistani Air Force airmen) in India’s #OperationSindoor that hit Pakistan.
Pakistan Army:
Naik Abdul Rehman
Lance Naik Dilawar Khan
Lance Naik Ikramullah
Naik… pic.twitter.com/p7Mp2nIwhv
Also Read: కాల్పుల విరమణ తర్వాత మోదీ ఫస్ట్ ట్వీట్.. ఏమన్నారంటే?
ISPR వెల్లడించిన లెక్కల ప్రకారం
పాకిస్తాన్ మీడియా ప్రకారం భారత్ తో ఇటీవల జరిగిన ఘర్షణలో సైనిక, పౌర మరణాల అధికారిక వివరాలను పాకిస్తాన్ సైన్యం మంగళవారం విడుదల చేసింది. ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) ప్రకారం, మే 6 , 7 తేదీలలో భారత చర్యకు ప్రతిస్పందనగా 'ఆపరేషన్ బన్యన్-అన్-మార్సాస్ సందర్భంగా దేశాన్ని రక్షించే క్రమంలో 11 మంది సైనికులు మరణించగా, 78 మంది సిబ్బంది గాయపడ్డారు. భారత దాడుల్లో మరణించిన ఆరుగురు ఆర్మీ సిబ్బంది నాయక్ అబ్దుల్ రెహ్మాన్, నాయక్ వకార్ ఖలీద్, లాన్స్ నాయక్ దిలావర్ ఖాన్, ఇక్రముల్లా, సిపాయి ఆదిల్ అక్బర్ , సిపాయి నిసార్ అని ISPR తెలిపింది.
Also Read: కాల్పుల విరమణలో వీళ్లే కీలకం.. ఇరు దేశాల DGMO గురించి మీకు తెలుసా?
పాకిస్తాన్ సైన్యం ప్రకారం సైనిక ప్రాణనష్టమే కాకుండా, భారత సైన్యం నియంత్రణ రేఖ వెంబడి ఎటువంటి కవ్వింపు లేకుండా జరిపిన షెల్లింగ్ వల్ల కూడా భారీగానే పౌరులు మరణించారు. ISPR ప్రకటన ప్రకారం, ఏడుగురు మహిళలు, 15 మంది పిల్లలు సహా 40 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా, 27 మంది పిల్లలు, 10 మంది మహిళలు సహా 121 మంది గాయపడ్డారు.
Inter-Services Public Relations | pakistan-army | india operation sindoor