/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/imd-jpg.webp)
rains
ఏపీకి వాతావరణశాఖ మరోసారి వర్షసూచన ఉందంటోంది. ఈరోజు ఉత్తరాంధ్రలో మూడు ఉమ్మడి జిల్లాలతో పాటుగా చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. రాష్ట్రంలో నిన్న అధిక ఉష్ణోగ్రత కర్నూలులో 40.7 డిగ్రీలు,అధిక వర్షపాతం అనకాపల్లి జిల్లా చీడికాడలో42.5 మిమీ నమోదైందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.
Also Read: Google: 247 మిలియన్ల ప్రకటనలపై గూగుల్ ఉక్కుపాదం!
IMD Alert On Andhra Pradesh
అంతేకాకుండా పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉండంటతో.. చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని సూచించారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.. పలు జిల్లాల్లో అకాల వర్షాలతో జనాలు ఇబ్బందిపడ్డారు. ప్రకాశం, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. ఒంగోలులో కురిసిన వానలకు రోడ్లు జలమయం అయ్యాయి. జంగారెడ్డిగూడెంలో భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పంట నష్టం జరిగింది. ఈ వర్షాలతో రైతులు కూడా నష్టపోయారు. కళ్లాల్లోని ధాన్యం తడిసిపోయింది. బొప్పాయి, అరటి తోటలు దెబ్బతిన్నాయి. మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి. అంతేకాదు పలుచోట్లు భారీ వర్షం పడటంతో డ్రైనేజ్ కాలువలు సైతం రోడ్లపై పొంగి ప్రవహించాయి.. దీంతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు.
Also Read: Indian Students: ఆ మూడు దేశాలకు భారీగా తగ్గిన భారతీయ విద్యార్థులు..!
మరోవైపు రైతులకు ఐఎండీ శుభవార్త చెప్పింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్లో (జూన్- సెప్టెంబరు) సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది దేశవ్యాప్తంగా జూన్ నుంచి సెప్టెంబరు మధ్య సాధారణం కంటే ఎక్కువగా వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్లోఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, పశ్చిమబెంగాల్తోపాటు దక్షిణాదిలో సాధారణం కంటే ఎక్కువగా వర్షపాతం నమోదవుతుందని భావిస్తున్నారు. తమిళనాడు, జమ్మూ కశ్మీర్, బీహార్, ఈశాన్యంలో సాధారణం కంటే తక్కువ నమోదవుతుంది అంటున్నారు
ఏపీలో ఈ ఏడాది నైరుతి సీజన్లో ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే అత్యంత ఎక్కువగా.. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు కురుస్తాయంటున్నారు. రాయలసీమ ల్లోని అన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అవుతుందని తెలిపారు. కృష్ణా, గోదావరి బేసిన్ పరీవాహక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయంటున్నారు.
Also Read: భార్యతోపాటు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్ పర్యటన.. షెడ్యూల్ ఇదే
Also Read: Combination Drugs: 35 రకాల ఔషదాలు నిషేధించిన కేంద్రం
ap | rains | imd | imd alert | ap-weather | AP Weather Alert | AP Weather Latest Update | ap weather news | ap weather today | ap weather updates | ap weather update today | latest-news | tirupati | prakasam | srikakulam | telugu-news | latest-telugu-news | latest telugu news updates