Rain Alert To Telangana | తెలంగాణలో రేపు కుమ్ముడే | Weather Repot Updates | RTV
ఏపీ బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. గ్రానైట్ పలకల లోడుతో వెళ్తున్న లారీ ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ పలకల కింద పడి స్పాట్లోనే ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఏలురు జిల్లా కోటపాడు గ్రామంలో పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. చిన్నకుమారుడి వివాహం జరిగిన మరుసటి రోజే ఇంటి పెద్ద కోడలు జ్యోత్స్న మరణించింది. బుధవారం రాత్రి పెళ్లి ఉండగా.. మధ్యాహ్నం కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన జ్యోత్స్న ఆపరేషన్ జరిగిన తెల్లారే చనిపోయింది.
ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.శ్రీకాకుళంలో తేలికపాటి వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.
ఉత్తరాంధ్రలో శని, ఆదివారాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అయితే, శ్రీకాకుళం, విజయనగరంలో వడగాలులు తీవ్రంగా ఉంటాయి. ఐదు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల మధ్య నమోదవుతాయని తెలిపారు.
ఏపీ ప్రభుత్వం దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.కేశఖండనశాలల్లో పనిచేసేవారి కనీస కమీషన్ను పెంచింది. గతంలో రూ.20 వేలు ఉండగా ఇప్పుడు రూ.25 వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
తిరుమల శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అన్నమయ్య సంకీర్తనలను యూట్యూబ్ ద్వారా ప్రజలకు అందించాలని ఈవో జె. శ్యామలరావు అధికారులను ఆదేశించారు. వేసవిలో భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు
జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ఇద్దరు ఏపీ వాసులు మృతి చెందారు. విశాఖ కు చెందిన రిటైర్ట్ ఉద్యోగి చంద్రమౌళి ఒకరు.నెల్లూరు కావలికి చెందిన మధుసూదన్ గా అధికారులు గుర్తించారు.