Delhi Rains: ఢిల్లీని ముంచెత్తిన వాన..పలుచోట్ల మునిగిన రోడ్లు, ఆగిన విమానాలు
దేశ రాజధాని ఢిల్లీని వర్షాలు ముంచెత్తాయి. నిన్న రాత్రి నుంచి కుంభవృష్టి కురుస్తోంది. దీంతో చాలా రోడ్లు జలమయ్యాయి. 100కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
HYD Rain: దంచికొడుతున్న వాన.. ఆ ఏరియాల్లో స్తంభించిన ట్రాఫిక్.. చెరువులను తలపిస్తున్న రోడ్లు!
హైదరాబాద్లో కురిసిన కుండపోత వర్షాలకు రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడిక్కడా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ముఖ్యంగా గచ్చిబౌలి, ఐటీ హబ్, కూకట్పల్లి, అమీర్పేట్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Hyderabad Traffic: హైదరాబాద్లో భారీగా ట్రాఫిక్ జామ్.. ఈ ఏరియాల్లోకి అసలు వెళ్లవద్దు
హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లపై వరదనీరు ఎక్కడపడితే అక్కడ నిలిచిపోయింది. దీంతో ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోంది. మాదాపూర్ టీహబ్, నాలెడ్జ్ సిటీ, మియాపూర్, హైటెక్ సిటీ వంటి ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
Weather Update: అల్పపీడనం ఎఫెక్ట్.. నాలుగు రోజుల వరకు తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావం వల్ల ఈ నెల 24వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశమున్నట్లు తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
Hyderabad Heavy Rains: హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్.. మరో రెండు గంటల్లో కుండపోత వర్షాలు
క్యూములోనింబస్ వల్ల హైదరాబాద్ సిటీలో మరో రెండో గంటల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. అత్యవసరం అయితేనే బయటకు రావాలని వెల్లడించారు.
Weather Update: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నల్గొండ, సూర్యాపేట, నాగర్కర్నూల్, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
Texas Heavy Rains: టెక్సాస్లో భారీ వరద బీభత్సం.. 160 మందికి పైగా..!
అమెరికాలోని టెక్సాస్లో కెర్ కౌంటీ, ట్రావిస్, బర్నెట్, టామ్ గ్రీన్, విలియమ్సన్ కౌంటీలు పూర్తిగా నీట మునిగాయి. ఈ వరదల కారణంగా 130 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 160 మంది ఆచూకీ తెలియదు. వేలాది ఇళ్లు దెబ్బతిన్నాయి.
Weather Update: ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన అధికారులు
దేశంలో ఉత్తరాది రాష్ట్రాల్లో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాజస్థాన్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో 16వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.