Ap Rains: ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు..!
ఏపీలో మరోసారి వర్ష సూచనతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఉత్తరాంధ్ర, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఏపీలో మరోసారి వర్ష సూచనతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఉత్తరాంధ్ర, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఏపీలో రానున్న మూడు రోజులు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.శ్రీకాకుళం,విజయనగరం,ప్రకాశం జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడనున్నాయి.
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని, ఇది ఉత్తర దిశగా కదులుతూ బలహీనపడుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాగల 24 గంటల్లో ఉత్తర, దక్షిణ కోస్తాలో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది
ఏపీలో ఎండ, వడగాల్పుల తీవ్రత కొనసాగుతోంది. ప్రకాశం జిల్లాలో 42.4, నెల్లూరు జిల్లాలో 42.2, కడప జిల్లాలో 42.1 డిగీ్రల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం తో పాటు 89 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీస్తాయని అధికారులు తెలిపారు.
ఏపీలో ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావారణ శాఖ ఓ చల్లటి వార్త చెప్పింది. ఏపీలో నాలుగు రోజుల పాటూ పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.
శీతాకాలంలో చలి పంజా విసురుతుంది. పెరుగుతున్న చలి కారణంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కొన్ని పాఠశాలకు సెలవులు ప్రకటించింది. లక్నో, బరేలీ, షాజహాన్పూర్ జిల్లాల్లో స్కూళ్లకు జనవరి 16 వరకు సెలవు పొడిగించారు. కొన్ని స్కూల్స్ ఆన్లైన్ క్లాస్లు నిర్వహిస్తున్నాయి.