Google: 247 మిలియన్ల ప్రకటనలపై గూగుల్ ఉక్కుపాదం!

టెక్‌ దిగ్గజం గూగుల్‌ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.పెద్ద ఎత్తున ప్రకటన దారుల ఖాతాల్ని సస్పెండ్‌ చేసింది. భారత్‌ లో ఏకంగా 247.4 మిలియన్ల యాడ్స్‌ ను తొలిగించింది. 2.9 మిలియనల్ అడ్వర్టైజర్‌ ఖాతాలను సస్పెండ్‌చేసినట్లు కంపెనీ తన నివేదికలో పేర్కొంది.

New Update
JOBS: ఇంటర్ పాసైతే చాలు..గూగుల్లో ఉద్యోగం మీదే..పూర్తి వివరాలివే..!!

Google

టెక్‌ దిగ్గజం గూగుల్‌ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.పెద్ద ఎత్తున ప్రకటన దారుల ఖాతాల్ని సస్పెండ్‌ చేసింది. డిజిటల్‌ యాడ్స్ ఎకోసిస్టమ్‌ ను విశ్వసనీయంగా ఉంచే ప్రయత్నంలో భాగంగా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రకటన విధాన నిబంధనల్ని ఉల్లంఘించిన కారణంగా 2024లో భారత్‌ లో ఏకంగా 247.4 మిలియన్ల యాడ్స్‌ ను తొలిగించింది. 2.9 మిలియనల్ అడ్వర్టైజర్‌ ఖాతాలను సస్పెండ్‌చేసినట్లు కంపెనీ తన నివేదికలో పేర్కొంది.

Also Read: Indian Students: ఆ మూడు దేశాలకు భారీగా తగ్గిన భారతీయ విద్యార్థులు..!

ప్రపంచ వ్యాప్తంగా గూగుల్‌ 39.2 మిలియన్లకు పైగా ప్రకటనదారుల ఖాతాలను సస్పెండ్‌ చేసింది.5.1 బిలియన్ ప్రకటనల్ని తొలగించినట్లు కంపెనీ తన వార్షిక యాడ్స్‌సేఫ్టీ రిపోర్ట్‌ లో తెలిపింది. గూగుల్‌ ప్రకటన విధాన నిబంధనల ఉల్లంఘనల జాబితాలో ఆర్థిక సేవలకు సంబంధించిన యాడ్స్‌ ముందు వరుసలో ఉన్నట్లు సమాచారం.

Also Read: భార్యతోపాటు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్ పర్యటన.. షెడ్యూల్ ఇదే

Google Suspends 2 Million Ad Accounts

ట్రేడ్‌ మార్క్‌ఉల్లంఘనలు, యాడ్స్‌ దుర్వినియోగం , జూదం ,గేమ్స్‌ కి సంబంధించిన ప్రకటనలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.దేశంలో డిజిటల్‌ లావాదేవీలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఇటువంటి డిజిటల్‌ యుగంలో ఆన్‌ లైన్‌ ఆర్థికమోసాలు, బ్రాండ్‌ దుర్వినియోగం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వినియోగదారులకు హానికలిగించే ప్రకటనల్ని నిషేదిస్తూ గూగుల్‌ చర్యలు తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

నిరంతరం పెరుగుతున్న మోసాలకు అడ్గుకట్ట వేసేందుకు తమ సామర్థ్యాలను పెంచుకున్నట్లు గూగుల్ తెలిపింది. ముఖ్యంగా ఏఐ వీడియోల ప్రకటనలు పెరిగాయని ఈ సందర్భంగా పేర్కొంది.మోసాలను ప్రోత్సహించే ప్రకటన దారలును సస్పెండ్‌ చేసేందుకు 100 మందికి పైగా నిపుణుల బృందం కృషి చేశారని తెలిపింది.

ఫలితంగా 7 లక్షలకు పైగా నేరపూరిత ప్రకటనదారుల ఖాతాల్ని శాశ్వతంగా నిలిపివేసినట్లు వివరించింది.దీంతో గతేడాదిలో ఈ తరహా స్కామ్‌ ప్రకటనలు 90 శాతం తగ్గినట్లు తెలిపింది.

Also Read:  bihar fire accident: ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు పిల్లలు మృతి

Also Read:  Combination Drugs: 35 రకాల ఔషదాలు నిషేధించిన కేంద్రం

 

telugu-news | latest-news | latest-telugu-news | ads | latest telugu news updates

Advertisment
Advertisment
తాజా కథనాలు