Deputy Cm Pawan Kalyan At Haryana | హరియాణా ఎన్నికల ఫలితాలపై పవన్ రియాక్షన్స్ | RTV
హర్యానా ముఖ్యమంత్రిగా మరోసారి నాయబ్ సింగ్ సైనీ ఎన్నికయ్యారు. పార్టీని మూడోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేసిన ఆయనవైపే అధిష్ఠానం మొగ్గుచూపింది. గురువారం సైనీ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
హర్యానా ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. మొత్తంగా 20 అసెంబ్లీ స్థానాల జాబితాను పంపింది. ఈ స్థానాల్లో విచారణ చేపట్టాలని ఈసీని డిమాండ్ చేసింది.
హర్యానాలో ఆప్ కారణంగానే కాంగ్రెస్ అత్యల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలైంది. బీజేపీకి 39.94, కాంగ్రెస్కు 39.09, ఆమ్ ఆద్మీకి 1.79 శాతం ఓట్లు లభించాయి. దీని ఆధారంగా కాంగ్రెస్తో ఆప్ పొత్తుపెట్టుకుంటే ఓట్లు చీలేవి కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జమ్మూ-కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. జమ్మూలో బీజేపీ నేతల పనితీరు చూస్తుంటే తనకు గర్వంగా ఉందన్నారు. ‘నేషనల్ కాన్ఫరెన్స్’కు మోదీ అభినందనలు తెలిపారు. అభివృద్ధి, సుపరిపాలనే హర్యానాలో గెలిపించాయని చెప్పారు.
హర్యానాలో కులసమీకరణాలే కాంగ్రెస్ను దెబ్బకొట్టినట్లు తెలుస్తోంది. 24 శాతం ఉన్న జాట్ సామాజికవర్గం కాంగ్రెస్కు మద్ధతుగా నిలవగా.. జాటేతర ఓటర్లను బీజేపీ తనవైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయింది. ఫలితంగా మూడోసారి బీజేపీ అధికారం చేపట్టనుంది.
హర్యానాలో మెజార్టీ పోల్ సర్వేలు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కుండబద్దలుకొట్టి చెప్పినప్పటికీ ఫలితాలు తారుమారయ్యాయి. బీజేపీ పార్టీ మేజిక్ ఫిగర్ను దాటేసి అధికారాన్ని దక్కించుకుంది. బీజేపీ గెలవడానికి గల కారణాలు తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి.
నేడే హర్యానా, జమ్మూకశ్మీర్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. పార్లమెంటు ఎన్నికల తర్వాత జరిగిన మొదటి ఎన్నికలు ఇవే. అందుకే ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.