Haryana: ఆ నీరు పాకిస్థాన్‌కు వెళ్లొద్దు.. హర్యానా కీలక ప్రకటన

పంజాబ్‌ వద్ద భాక్రా నంగల్ రిజర్వాయర్‌లో అదనంగా మిగిలిపోయిన నీటిని తమకు ఇవ్వాలని హర్యానా కోరింది. ఈ నీరు పాకిస్థాన్‌కు పాకిస్థాన్‌కు వెళ్తున్నాయని.. దీనివల్ల ఏ ప్రయోజనం లేదని తెలిపింది. అందుకే ఆ నీటిని తమ రాష్ట్రానికి ఇవ్వాలని అభ్యర్థించింది.

New Update
Haryana's 'Bhakra Dam' Request To Punjab

Haryana's 'Bhakra Dam' Request To Punjab

పహల్గాగం దాడి అనంతరం భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం కీలక అభ్యర్థన చేసింది. పంజాబ్‌ వద్ద భాక్రా నంగల్ రిజర్వాయర్‌లో అదనంగా మిగిలిపోయిన నీటిని తమకు ఇవ్వాలని కోరింది. ఆ నీరు పాకిస్థాన్‌కు వెళ్తున్నాయని.. దీనివల్ల ఏ ప్రయోజనం లేదని తెలిపింది. అందుకే ఈ నీరు పాకిస్థాన్‌కు వెళ్లకుండా తమ రాష్ట్రానికి ఇవ్వాలని పంజాబ్‌ను హర్యానా అభ్యర్థించింది. భారత్-సింధూ జలాల ఒప్పందం నిలిపివేయండంతో హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ ఈ ప్రకటన చేశారు. సింధూ జలాల ఒప్పందం పరిధిలోని అతిపెద్ద ఆనకట్టల్లో భాక్రా రిజర్వాయర్ ఒకటి. 

Also Read: మనకు అణ్వాయుధాలున్నాయి..మనల్నేం చేయలేరు....మరియం నవాజ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు

నాయబ్‌ సింగ్ సైనీ మాట్లాడుతూ..'' జూన్ నాటికి భాక్రా నంగల్‌ ఆనకట్టను ఖాళీ చేయడం అవసరం. దీంతో వర్షాకాలంలో నదీ జలాలను నిల్వ చేసుకోవచ్చు. రిజర్వాయర్‌లో నీళ్లు లేకపోతే.. అదనపు జలాలు హరికెపట్టాన్ ప్రాంతం నుంచి పాకిస్థాన్‌కు వెళ్లిపోతాయి. ఇవి పంజాబ్‌కు గానీ, హర్యానాకు గానీ ఉపయోగపడవు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం ఉన్నప్పుడు నీటి విడుదలకు పంజాబ్ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరాలు లేవు. ప్రస్తుతం అక్కడ ఆప్‌ లేదు.. ఇలాంటి టైమ్‌లో ఢిల్లీ ప్రజలను శిక్షించేలా ఎందుకు ప్రకటనలు చేస్తున్నారు. 

Also Read: పాక్‌కు భారత్ మరో ఊహించని షాక్.. అప్పు ఇవ్వొద్దని IMFకు కంప్లైంట్!

హర్యానాకు రావాల్సిన నీటి వాటానే అందుబాటులోకి రాలేదు. గత నెలలో భాక్రా బేస్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డ్‌ విడుదల చేసిన నీటిలో పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీకి వెళ్లగా.. హర్యానాకు కేవలం 6800 క్యూసెక్కులు మాత్రమే మిగిలాయి. న్యాయంగా హర్యానాకు రావాల్సిన వాటా ఇచ్చినప్పటికీ కూడా అది భాక్రా ప్రాజెక్టులో నిల్వ ఉండే నీటిలో 0.0001 శాతానికి సమానమని'' నాయబ్ సింగ్ సైనీ అన్నారు. అలాగే చీనాబ్, జీలమ్ సహా ఇతర నదుల నీళ్లను ఉత్తరాది రాష్టాల్లో వ్యవసాయం కోసం మళ్లీంచాలి కేంద్రాన్ని ఆయన కోరారు. అయితే ప్రస్తుతం భాక్రానంగల్ ప్రాజెక్టు నీటిని పంజాబ్, హర్యానా, రాజస్థాన్ వాడుకుంటున్నాయి.  

haryana | telugu-news | punjab | national-news | international

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు