🔴Live News Updates: రేవంత్‌ రెడ్డికి బిగ్‌షాక్‌.. నేషనల్ హెరాల్డ్‌ కేసులో ఈడీ ఛార్జిషీట్‌

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Lok Prakash
New Update
LIVE BREAKING

LIVE BREAKING

🔴Live News Updates: 

Revanth Reddy - National Herald Case: రేవంత్‌ రెడ్డికి బిగ్‌షాక్‌.. నేషనల్ హెరాల్డ్‌ కేసులో ఈడీ ఛార్జిషీట్‌

Revanth Reddy - National Herald Case: నేషనల్ హెరాల్డ్‌ కేసుకు సంబంధించి కీలక అప్‌డేట్‌ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి పేరును ఈడీ ప్రస్తావించింది. యంగ్‌ ఇండియన్, అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌కు విరాళాలు అందించేందుకు సాయం చేసిన కాంగ్రెస్‌ నాయకుల్లో రేవంత్ రెడ్డి కూడా ఉన్నట్లు ఈడీ వెల్లడించింది. కానీ ఆయన్ని నిందితుడిగా పేర్కొనలేదు. 

Also Read: మావోయిస్టు మృతుల వివరాలు వెల్లడించిన పోలీసులు.. తెలుగువారి లిస్ట్ ఇదే!

ఇక వివరాల్లోకి వెళ్తే..

ఏప్రిల్ 9న కోర్టులో ఈడీ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కొడుకు రాహుల్‌ గాంధీ.. యంగ్ ఇండియన్‌ ద్వారా అసోసియేటెడ్ జర్నల్స్‌ లిమిటెడ్‌ (AGL) కు రూ.2 వేల కోట్ల విలువైన ఆస్తులు మళ్లించేందుకు ప్లాన్ వేసినట్లు ఆరోపణలు చేసింది. 2019-2022 మధ్య రేవంత్‌ రెడ్డితో పాటు పవన్‌ బన్సాల్, అహ్మద్‌ పటేల్ వంటి కొందరు కాంగ్రెస్ నేతలు ఏఐ, ఏజీఎల్‌కు విరాళాలు ఇచ్చేందుకు కొంతమందిని ప్రభావితం చేశారని ఈడీ తెలిపింది. ఈ విరాళాలు లీగల్‌ కావని.. రాజకీయ ప్రయోజనాలు ఆశించి వచ్చినట్లు అభిప్రాయం వ్యక్తం చేసింది. 

Also Read: అమెరికా అమెరికాలోనే ఉంది..భారత్, పాక్ కాల్పుల విరమణలో దాని జోక్యం లేదు..జైశంకర్

ఏంటీ నేషనల్ హెరాల్డ్‌ కేసు ? 

అసోసియేటెడ్ జర్నల్స్‌ లిమిటెడ్‌ (AGL) కంపెనీ.. నేషనల్ హెరాల్డ్ న్యూస్‌ పేపర్‌ను ప్రచురించేది. అయితే 2008లో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ పేపర్‌ ప్రచురణ ఆగిపోయింది. దీంతో ఇండియన్ నేషలన్ కాంగ్రెస్‌ ఏజీఎల్‌ కంపెనీకి రూ.90.25 కోట్ల వడ్డీ లేని రుణం ఇచ్చింది. దీంతో  2010లో యంగ్‌ ఇండియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే కొత్త సంస్థ ప్రారంభమయ్యింది. ఇందులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రధాన వాటాదారులుగా ఉన్నారు. అయితే యంగ్‌ ఇండియన్ కేవలం రూ.50 లక్షలు మాత్రమే చెల్లించి ఏజీఎల్‌ ఆస్తులు పొందినట్లు, ఇందులో మనీలాండరింగ్‌ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.  

Also Read: అమ్మా నేను చిప్స్ దొంగతనం చేయలేదు.. గుండెలు పిండేసిన 7వ తరగతి విద్యార్థి సూసైడ్ లెటర్!

ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన ఈడీ ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తోంది. ఢిల్లీ కోర్టుకు ఈడీ చెప్పిన వివరాల ప్రకారం.. సోనియాగాంధీ తన AICC అధ్యక్ష పదవిని దుర్వినియోగం చేసి, యంగ్ ఇండియన్ ద్వారా ప్రజా ధనాన్ని తమ సొంత ప్రయోజనాల కోసం వినియోగించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ కేసులో ఈడీ సోనియా గాంధీని ఏ వన్‌గా, రాహుల్‌గాంధీని ఏ2గా పేర్కొంటూ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ జరుగుతోంది. 

Also Read: ఆపరేషన్‌ సిందూర్‌ ఆగలేదు: కేంద్రం

  • May 23, 2025 13:56 IST

    Preity Zinta Files Legal Case: పంజాబ్‌ కింగ్స్ టీమ్‌లో వివాదం.. ఆ ముగ్గురిపై కోర్టుకెక్కిన ప్రీతి జింటా!

    పంజాబ్ కింగ్స్ జట్టు సహ యాజమాని ప్రీతి జింటా ఇతర డైరెక్టర్లపై చండీగఢ్ కోర్టులో దావా వేసింది. ఏప్రిల్ 21వ తేదీన జరిగిన సర్వసభ్య సమావేశం చట్టబద్ధతను ఆమె కోర్టులో సవాలు చేసింది. సహ డైరెక్టర్లు మోహిత్ బర్మన్, నెస్ వాడియాలకు వ్యతిరేకంగా కోర్టుకెక్కింది.

    Preity Zinta



  • May 23, 2025 13:55 IST

    TG News: అదంతా డ్రామా.. కవిత లేఖపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!

    కేసీఆర్‌కు కవిత రాసిన లేఖపై కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అదంతా ఒక డ్రామా అని చెప్పారు. బీఆర్ఎస్‌లో చీలికలు లేవని, కవిత రాసినట్టు బయటకు వచ్చిన లెటర్ ఓ జోక్ అంటూ సెటైర్స్ వేశారు.

    komati r
    komati r Photograph: (komati r)

     



  • May 23, 2025 12:48 IST

    Telangana: తెలంగాణ పంచాయతీ ఎన్నికలపై బిగ్‌ అప్‌డేట్.. షెడ్యూల్ ఖరారు !

    తెలంగాణలో జూన్‌ చివరి వారంలో లేదా జులై ప్రారంభంలో పంచాయతీ ఎన్నికలు జరపాలని రేవంత్‌ సర్కార్‌ ప్లాన్ వేస్తోంది. దీంతో పాటు MPTC, ZPTC, మున్సిపల్‌ ఎన్నికలు కూడా వరుసగా చేపట్టాలని యోచిస్తోంది.

    Local Body Elections in Telangana
    Local Body Elections in Telangana

     



  • May 23, 2025 12:10 IST

    Israel Couple: కొన్ని రోజుల్లో నిశ్చితార్థం..అంతలోనే ఉగ్రవాదుల చేతుల్లో ఇజ్రాయెల్ దౌత్య జంట మృతి

    వాళ్ళిద్దరూ ఒకటే దేశస్థులు..ఒకే చోట పని చేస్తున్నారు కూడా. పైగా ఇద్దరూ ఇష్టపడ్డారు. పెళ్ళి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. కానీ అంతలోనే మృత్యువు ఎదురొచ్చింది. వాష్టింగ్టన్‌లోని ఉగ్రవాదులు చంపేసిన ఇజ్రాయెల్ దౌత్యవేత్తల కథ ఇది.

    USA
    Israel Ambasidors

     



  • May 23, 2025 12:08 IST

    BIG BREAKING: కడపలో కరోనా కలకలం.. రెండు కేసులు నమోదు!

    ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా కడపలో రెండు కరోనా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. రిమ్స్‌ ఆస్పత్రిలో రెండు పాజిటీవ్‌ కేసులు నమోదయ్యాయి.

    carona
    carona

     



  • May 23, 2025 10:10 IST

    Bangladesh: బంగ్లాదేశ్ తాత్కాలిక అధిపతి యూనస్ రాజీనామా? వ్యాపిస్తున్న వార్తలు

    బంగ్లాదేశ్ తాత్కాలిక అధిపతి మొహమ్మద్ యూనస్ ఇక పని చేయలేనని అంటున్నారని సమాచారం. అక్కడి రాజకీయ పార్టీలు అన్నీ ఒక నిర్ణయానికి రాకలేవడం వలన యూనస్ ఇక పదవిలో కొనసాగలేనని చెబుతున్నారంటూ బంగ్లా బీబీసీ వార్తను ప్రచురించింది. 

    bangla
    Muhammad Yunus

     



  • May 23, 2025 10:08 IST

    Floods in China: చైనాలో వరదల బీభత్సం.. 10 మంది మృతి

    చైనాలో భారీ వరదలు బీభత్సం సృష్టించాయి. ఊహన్, గాంగ్‌డాంగ్, గాంగ్జీ, జీజియాంగ్ నగరాలు నీటమునిగాయి. కొండచరియలు విరిగిపడి 10 మంది మృతి చెందారు. మరో 20 మందికి పైగా గల్లంతయ్యారు.

    Floods in China
    Floods in China
     



  • May 23, 2025 10:07 IST

    Obesity: 2030 నాటికి 50 కోట్ల మందికి ఉబకాయం.. లాన్సెట్ నివేదికలో సంచలన విషయాలు

    2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 కోట్ల మంది యువత ఊబకాయంతో బాధపడుతున్నారని ఓ అధ్యయనం తెలిపింది. వీళ్లు ఆరోగ్యపరమైన, మానసిక అస్వస్థలను ఎదుర్కొంటారని లాన్సెట్‌ కమిషన్ తన నివేదికలో వెల్లడించింది.

    Close to 500 million young adults will be obese by 2030, Lancet study
    Close to 500 million young adults will be obese by 2030, Lancet study

     



  • May 23, 2025 07:15 IST

    Rains: రెండు వైపుల నుంచి ముంచుకొస్తోంది..అరేబియాలో వాయుగుండం, బంగాళాఖాతంలో అల్పపీడనం

    అరేబియా సముద్రంలో వాయుగుండం కొనసాగుతోంది. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం పీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో 6 రోజుల్లో గుజరాత్, గోవా, కర్ణాటక, కేరళ, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో  అతిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.

    rains
    rains

     



  • May 23, 2025 07:14 IST

    Jai Shankar: అమెరికా అమెరికాలోనే ఉంది..భారత్, పాక్ కాల్పుల విరమణలో దాని జోక్యం లేదు..జైశంకర్

    భారత్, పాక్ కాల్పుల విరమణ విషయాన్ని తమ రెండు దేశాలే చర్చించుకుని నిర్ణయించుకున్నాయని.. అమెరికాను వేలు పెట్టనివ్వలేదని విదేశాంగ మంత్రి జైశంకర్ మరోసారి గట్టిగా చెప్పారు. ట్రంప్ తానే యుద్ధాన్ని ఆపానని పదే పదే చెప్పుకుంటున్న నేపథ్యంలో ఆ వ్యాఖ్యలు చేశారు. 

    Jai Shankar : అక్కడ కూడా ముస్లిం బుజ్జగింపు పాలిటిక్సే.. విదేశంగ మంత్రి జైశంకర్ సంచలన కామెంట్స్



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు