/rtv/media/media_files/2025/05/23/IUQo2yOZcKHBLgexXFVU.jpg)
తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత లేఖ సంచలనంగా మారింది. ఈరోజు ఆమె అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకుంది. మరి కాసేపట్లో కవిత మీడియా ముందుకు వచ్చి తండ్రి కేసీఆర్కు రాసిన లేఖపై వివరణ ఇవ్వనున్నారు. దీంతో ఆమె అనుచరులు, పార్టీ లీడర్లు పెద్ద ఎత్తున శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. ఎయిర్పోర్ట్లో ఎక్కడా కూడా గులాబీ జెండాలు కనిపించలేదు. సామాజిక తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్న కవితక్కకు స్వాగతం అంటూ ప్లకార్డులు, ఫ్లెక్సీలు పట్టుకొని కార్యకర్తలు అక్కడకి వచ్చారు. అయితే ఎయిర్పోర్ట్ దగ్గరకు బీఆర్ఎస్ నాయకులు కూడా రాలేదు.
కాసేపట్లో హైదరాబాద్కు ఎమ్మెల్సీ కవిత
— Telangana365 (@Telangana365) May 23, 2025
కేసీఆర్కు రాసిన లేఖపై క్లారిటీ ఇవ్వనున్న కవిత
కవితకు స్వాగతం పలకడానికి రాని బీఆర్ఎస్ నేతలు
🔹తెలంగాణజాగృతి కార్యకర్తలతో నిండిపోయిన ఎయిర్పోర్ట్
బీసీ కులసంఘాల పేరిట కొత్త బ్యానర్లు
గులాబీరంగు మాయం.
🔹కొత్తగా నీలిరంగులో బ్యానర్లు, బ్యానర్లలో… pic.twitter.com/9vtD6aHuLA
సిఎం సిఎం అంటూ అమెరికా నుంచి తిరిగి వచ్చిన కల్వకుంట్ల కవిత కి విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన బిఆర్ఎస్ శ్రేణులు.@RaoKavitha #KalvakuntlaKavitha pic.twitter.com/NAURtW66LA
— Icon News (@IconNews247) May 23, 2025
టీం కవితక్క పేరిట శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ప్లాకార్డుల ప్రదర్శన.
— Telangana365 (@Telangana365) May 23, 2025
కుమారుడి గ్రాడ్యుయేషన్ వేడుకకు వహైదరాబాద్ కి తిరిగి వస్తున్న ఎమ్మెల్సీ దేవనపల్లి కవిత గారు స్వాగతం పలికేందుకు శంషాబాద్ ఎయిర్పోర్టులో సిద్ధంగా ఉన్న కవిత గ్రూపు సబ్యులు. pic.twitter.com/pMrOW2S8u4
కవితకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ప్లెక్సీలో బీఆర్ఎస్ పార్టీ బాస్ కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు కూడా లేవు. నీలిరంగు జెండాలు పట్టుకొని కవిత అభిమానులు, అనుచరులు నినాదాలు చేస్తున్నారు. అంతేకాదు టీమ్ కవితక్క అనే ప్లక్సీలు పట్టుకొని కార్యకర్తలు సీఎం సీఎం అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మౌనంతో తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ప్రెస్మీట్ పెట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఏం చెబుతుందో అని రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఎదురుచూస్తున్నారు.
Shamshabad Airport | kavitha latter to KCR | brs | brs mlc kavitha