TG News: అదంతా డ్రామా.. కవిత లేఖపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!

కేసీఆర్‌కు కవిత రాసిన లేఖపై కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అదంతా ఒక డ్రామా అని చెప్పారు. బీఆర్ఎస్‌లో చీలికలు లేవని, కవిత రాసినట్టు బయటకు వచ్చిన లెటర్ ఓ జోక్ అంటూ సెటైర్స్ వేశారు.

New Update
komati r

Minister komati reddy Venkat Reddy shocking comments on Kavitha letter

TG News: కేసీఆర్‌కు కవిత రాసిన లేఖపై కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అదంతా ఒక డ్రామా అని చెప్పారు. బీఆర్ఎస్ కు భవిష్యత్తు లేదని, కవిత రాసినట్టు బయటకు వచ్చిన లెటర్ ఓ జోక్ అంటూ సెటైర్స్ వేశారు. మాజీ  ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్న ఆమె రాసిన లేఖ ఓ పద్ధతిగా ఉందా? అని ప్రశ్నించారు.

మాకు అవసరం లేదు..

ఇక ఆ లెటర్ కాంగ్రెస్ క్రియేట్ చేసిందనే వ్యాఖ్యలను ఖండించారు. లెటర్ రాయాల్సిన అవసరం తమకు లేదన్నారు. బీఆర్ఎస్ లో చీలికలు ఏమీ లేవు. ఇదంతా ఓ డ్రామా. తండ్రికి లెటర్ రాయాల్సిన అవసరం ఏమిటి? నేరుగా విషయం చెప్పొచ్చు కదా! అంటూ తనదైన స్టైల్ లో విమర్శలు గుప్పించారు. 

Also Read: మావోయిస్టు మృతుల వివరాలు వెల్లడించిన పోలీసులు.. తెలుగువారి లిస్ట్ ఇదే!

మరోవైపు నల్లగొండ జిల్లా మాడుగులపల్లిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మాడుగులపల్లి మండల మాజీ జడ్పీటీసీ పుల్లెంల సైదులు.. కేక్ కట్ చేసి, స్వీట్లు, పండ్లను ప్రజలకు పంపిణీ చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. పేద ప్రజల అభ్యున్నతికి ఎల్లప్పుడూ కృషి చేస్తున్న ప్రజా నేత అని ప్రశంసించారు.

 komati-reddy-venkatareddy | mlc kavitha | kcr | letter | today telugu news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు