BIG BREAKING: వైసీపీలో విషాదం.. సీనియర్ నేత తోపుదుర్తి భాస్కర్ రెడ్డి కన్నుమూత!

వైసీపీ సీనియర్ నేత తోపుదుర్తి భాస్కర్ రెడ్డి కన్నుమూశారు. శుక్రవారం మధ్యాహ్నం పొలంలో పనులు చేయిస్తూఆకస్మికంగా కళ్లు తిరిగి కింద పడిపోయారు. దీంతో హుటాహుటిన ఆయనను ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు అప్పటికే ఆయన చనిపోయినట్లు నిర్ధారించారు.

New Update
Thopudurthy Bhaskar Reddy

వైసీపీ సీనియర్ నేత తోపుదుర్తి భాస్కర్ రెడ్డి కన్నుమూశారు. శుక్రవారం మధ్యాహ్నం పొలంలో పనులు చేయిస్తూఆకస్మికంగా కళ్లు తిరిగి కింద పడిపోయారు. దీంతో హుటాహుటిన ఆయనను ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు అప్పటికే ఆయన చనిపోయినట్లు నిర్ధారించారు. భాస్కర్ రెడ్డి మృతిపట్ల రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్నాన్న తోపుదుర్తి భాస్కర్ రెడ్డి మృతికి సంతాపం తెలియజేశారు. వఅనంతపురం వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి తీవ్ర దిగ్రాంతి వ్యక్తం చేశారు. భాస్కర్ రెడ్డి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. భాస్కర్ రెడ్డితో తనకు ఆత్మీయ అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. 

తోపుదుర్తి భాస్క‌ర్‌రెడ్డి ఆక‌స్మిక మ‌ర‌ణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని మాజీ సీఎం జగన్ అన్నారు. క్ర‌మ‌శిక్ష‌ణ క‌లిగిన నాయ‌కుడిగా పార్టీకి ఆయ‌న అందించిన సేవ‌లు మ‌రిచిపోలేనివని కొనియాడారు. ఈ క‌ష్ట స‌మ‌యంలో ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు దేవుడు ధైర్యం ప్ర‌సాదించాల‌ని, ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్థిస్తున్నానని అన్నారు. ఈ మేరకు తన X ఖాతాలో పోస్ట్ చేశారు జగన్. 

తోపుదుర్తి భాస్కర్ రెడ్డి సుధీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో పని చేశారు. ఆయన సతీమణి తోపుదుర్తి కవితమ్మ ఉమ్మడి అనంతపురం జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌గా కూడా పని చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ ఆవిర్భావం తర్వాత తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి దంపతులు వైఎస్‌ జగన్‌ వెంట నడిచారు. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో ఆయన కీలక నేతగా ఉన్నారు.
Advertisment
తాజా కథనాలు