Viral News: నిజాయితీకి మారు పేరంటే నువ్వే అన్న.. మరిచిన 12 తులాల బంగారం ఇచ్చిన ఆటో డ్రైవర్

నంద్యాల జిల్లాకు చెందిన లక్ష్మీబాయి, సూర్యనారాయణ, ఉమేష్ అనే ముగ్గురు వ్యక్తులు అనంతపురం ఆటోలో 12 తులాలు ఉండే బంగారం బ్యాగ్‌ను మరిచిపోయారు. ఆ ఆటోడ్రైవర్ వాటిని పోలీసులకు అందజేశాడు. దీంతో అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

New Update
auto driver

auto driver

ప్రస్తుతం బంగారం(gold) ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రోజురోజుకి బంగారం విలువ భారీగా పెరుగుతోంది. తులం బంగారం కొనాలనుకున్నా కూడా లక్షలు పెట్టాల్సిందే. అయితే నేటి రోజుల్లో ఎవరికైనా చిన్న ముక్క బంగారం దొరికితే మాత్రం దాచుకుంటారు. ఆ బంగారం ఎవరిదో వారికి కనీసం ఇవ్వరు. ఎందుకంటే ఇప్పుడు బంగారానికి ఉన్న విలువ అలాంటిది. ఇలాంటి రోజుల్లో ఓ ఆటో డ్రైవర్ తన నిజాయితీ చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నంద్యాల జిల్లాకు చెందిన లక్ష్మీబాయి, సూర్యనారాయణ, ఉమేష్ అనే ముగ్గురు వ్యక్తులు అనంతపురం వెళ్లారు. అయితే ఉదయం 11 గంటల సమయంలో ఆటో ఎక్కారు.

ఇది కూడా చూడండి:  వైసీపీ నేత గౌతమ్‌రెడ్డిపై హత్యాయత్నం!

12 తులాలు తిరిగిచ్చిన..

తాము వెళ్లవలసిన చోటుకు చేరుకున్నాక ఆటో దిగే సమయంలో బంగారం ఉన్న సూట్‌కేసును మరిచిపోయారు. ఆ ఆటో డ్రైవర్ చంద్రశేఖర్ వారు దిగిన కొంత సమయానికి గమనించారు. దానిని తెరిచి చూడగా అందులో విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయి. వెంటనే అతను ఆ సూట్ కేసును తిరిగి ఇవ్వడానికి ప్రయత్నించారు. కానీ వారు కనిపించలేదు. అప్పుడు ఆ ఆటో డ్రైవర్ నిజాయితీగా బంగారం ఆభరణాల బ్యాగ్‌ను తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాడు. వారు వెంటనే బంగారం ఎవరిది అనే విషయాన్ని గుర్తించి 12 తులాల బంగారం అందించారు. పోయిందని అనుకున్న బంగారం తిరిగి దక్కడంతో ఆ కుటుంబ సభ్యులు సంతోషపడి ఆ ఆటో డ్రైవర్‌కు రూ.10 వేలు ఇచ్చి సత్కరించారు. 

ఇది కూడా చూడండి:  ఛీ ఛీ.. ఇద్దరు మైనర్ బాలుల బట్టలిప్పి.. బ్లూ ఫ్లిమ్స్ చూపించి.. వాచ్‌మెన్ లైంగిక దాడి!

Advertisment
తాజా కథనాలు