🔴Live News Updates: న్యూస్ అప్డేట్స్
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఈ రెండు రోజులు పలుజిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ళ వానలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. 40నుంచి50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఈఏడాది దీర్ఘకాలిక సగటు కంటే 105 శాతం ఎక్కవ వర్షపాతం నమోదవుతుందని మంగళవారం IMD తెలిపింది. నైరుతి రుతుపవనాలు జూన్ 1న వచ్చి సెప్టెంబర్ మధ్య నాటికి ఉపసంహరించుకుంటాయని IMD అధికారులు వెల్లడించారు. ఇండియాలో రాబోయే వర్షాకాలం సంవృద్ధిగా వర్షాలు పడతాయంటున్నారు.
తెలంగాణలో మరో రెండు రోజులు పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావారణ శాఖ తెలిపింది. ఖమ్మం, వరంగల్ జిల్లాలో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. అయితే ఏపీలో ఎండ తీవ్రత, వడగాలులు అధికంగా ఉంటాయని వెల్లడించింది. ప్రజలు అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, ఫిల్మ్నగర్, హైటెక్ సిటీ, కొండాపూర్, లింగంపల్లి, మియాపూర్, మదీనా గూడ, చందానగర్ తదితర ప్రాంతాల్లో ఉరుముల, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది.
రానున్న మూడురోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదిలి.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది.
బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రభావం వల్ల ఏపీ, తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. 10, 11.12,13 తేదీల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
తెలంగాణలో రాబోయే 3,4 రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జరీ చేసింది.
ఏపీ, తెలంగాణలో నాలుగు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, మహబూబాబాద్, ములుగు, జనగామ, హన్మకొండలో కురవనున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.