Cyclone: ఏపీకి రెడ్‌ అలెర్ట్‌.. దూసుకొస్తున్న తుపాను

ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. మెంథా తుపాను రాష్ట్రంలో తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో రెడ్‌ అలెర్ట్ జారీ చేసింది.

New Update
Cyclone to Cross Andhra Coast Near Kakinada on Oct 28

Cyclone to Cross Andhra Coast Near Kakinada on Oct 28

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) కు తుపాను(cyclone) ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. మెంథా తుపాను కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో రెడ్‌ అలెర్ట్ జారీ చేసింది. ఆదివారం నుంచి నాలుగు రోజుల పాటు ఈ తుపాను ప్రభావం ఉంటుందని చెప్పింది. అక్టోబర్ 28న సాయంత్రం కాకినాడ సమీపంలో తీవ్రమైన తుపానుగా తీరం దాటే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించింది.  '' తుపాను వచ్చిన సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.   

Also Read: క్యాబ్‌ డ్రైవర్లకు గుడ్‌న్యూస్‌.. ఓలా, ఉబర్‌కు పోటీగా భారత్‌ ట్యాక్సీ.. కమీషన్ చెల్లించాల్సిన అవసరం లేదు..

Cyclone To Cross Andhra

వైజాగ్‌ నుంచి తిరుపతి వరకు ఈ తుపాను ప్రభావం ఉండనుంది. అలాగే హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో కూడా భారీ వర్షాలు(Heavy Rains) కురిసే ఛాన్స్ ఉందని'' వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏపీలో తీర ప్రాంత జిల్లాల్లో ఉన్న విద్యాసంస్థలకు ఈనెల 28,29 తేదీల్లో సెలవు ప్రకటించాలని సూచించారు. అలాగే దూర ప్రయాణాలు మానుకోవాలన్నారు. భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో ముఖ్యంగా దివిసీమ, విజయవాడ, మచిలీపట్నం, ఏలూరు, గుంటూరు, గోదివారి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు.  

Also Read: కావేరీ బస్సు ప్రమాదంలో బిగ్ ట్విస్ట్... సంచలన విషయాలు వెల్లడించిన శివశంకర్ స్నేహితుడు స్వామి

Advertisment
తాజా కథనాలు