/rtv/media/media_files/2025/05/04/2pdSxSBd4invPGSrI75q.jpg)
Telangana High Court Judge Justice Girija Priyadarshini passes away
TG High court: తెలంగాణలో విషాదం నెలకొంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గిరిజా ప్రియదర్శిని చనిపోయారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆదివారం కన్నుమూశారు. 2022లో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ఎంపికైన గిరిజా.. 2008-21 మధ్య అనేక జిల్లా కోర్టులకు జడ్జిగా పనిశారు. ఆమె మృతిపట్ల తోటి జడ్జిలు, న్యాయవాదులు, హైకోర్టు సిబ్బంది సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : తెలంగాణలో మారనున్న ఆరు కులాల పేర్లు..
విశాఖ జిల్లా కోర్టులో 7 ఏళ్లు..
విశాఖపట్నానికి చెందిన గిరిజా.. NBM లా కాలేజీలో లా, లేబర్ అండ్ ఇండస్ట్రీ లా లో మాస్టర్స్, 3 విభాగాల్లో పీజీ చదివారు. 1995లో లాయర్గా ఎన్రోల్ కాగా.. విశాఖ జిల్లా కోర్టులో 7 సంవత్సరాలు ప్రాక్టీస్ చేశారు. 2008లో అదనపు జిల్లా జడ్జిగా, విజయనగరం మొదటి అదనపు జిల్లా జడ్జిగా, నంద్యాలలో అదనపు జిల్లా జడ్జిగా విధులు నిర్వహించారు. ఆమె రాష్ట్ర లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీగా పనిచేశారు. 2022లో హైకోర్టు జడ్జిగా బాధ్యతలు స్వీకరించారు.
Also Read: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. జనన, మరణ రికార్డులతో ఓటర్ల జాబితా అనుసంధానం
తెలంగాణలోనూ ఖమ్మం ఫ్యామిలీ కోర్టులో 3 ఏళ్లు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యాయమూర్తి పనిచేసిన ఆమె.. జిల్లాలో అనేక కార్యక్రమాలలో పాల్గొన్నారు. సుప్రీంకోర్టు కొలీజియం 2022లో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని సిఫార్సు చేసింది. లోక్ అదాలత్లను నిర్వహించడం ద్వారా వేలాది పెండింగ్ కేసులను ఆమె పరిష్కరించారు.
Also Read: ప్రతీకారం తీర్చుకుంటాం.. ఉగ్రవాదులను చంపుతాం : అమిత్ షా సంచలన కామెంట్స్!
Also Read : దేశంలోని మొట్టమొదటి AI- ఆధారిత డేటా సెంటర్ పార్క్
today telugu news | telugu-news | died | judge | high-court | latest-telugu-news | today-news-in-telugu | breaking news in telugu | latest telangana news | telangana news live updates | telangana news today