/rtv/media/media_files/2025/05/01/E1QQ3HJLtpWruG88vZBd.jpg)
amitshah
27 మంది అమాయకుల ప్రాణాలు తీసుకున్న ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకుంటామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. ఉగ్రవాదుల జాడ కనిపెట్టి వారిని అంతమొందిస్తామని తెలిపారు. పహల్గామ్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు ఇది గొప్ప విజయం అని నమ్మితే, వారు గుర్తుంచుకోవాలి, ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం.. ఎవరినీ వదిలిపెట్టబోమని అమిత్ షా హెచ్చరించారు.
ఈ దేశంలోని ప్రతి మూల నుండి ఉగ్రవాదాన్ని నిర్మూలించడమే తమ సంకల్పమని అమిత్ షా వెల్లడించారు. 140 కోట్ల మంది భారతీయులు మాత్రమే కాదు, మొత్తం ప్రపంచం ఈ పోరాటంలో భారతదేశంతో నిలుస్తోందని చెప్పారు. ఉగ్రవాదం నిర్మూలించబడే వరకు, తమ పోరాటం కొనసాగుతుందని, ఉగ్రదాడికి పాల్పడిన వారికి ఖచ్చితంగా తగిన శిక్ష విధించబడుతుందని వెల్లడించారు.
#WATCH | Delhi: Union Home Minister Amit Shah says, "Under the leadership of Prime Minister Narendra Modi, we have given a strong reply to everything, be it the North East, the areas of Left Wing Extremism or the shadow of terrorism in Kashmir. If someone thinks that by carrying… pic.twitter.com/SdXGuDrJqQ
— ANI (@ANI) May 1, 2025
26 మంది మృతి
న్యూఢిల్లీలో బోడోఫా ఉపేంద్రనాథ్ బ్రహ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన అమిత్ షా.. ఆయన గౌరవార్థం ఒక రోడ్డు పేరు మార్చారు. అనంతరం అమిత్ షా మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు. కాగా ఏప్రిల్ 22న కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో జరిగిన భయంకరమైన ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా ఎక్కువ మంది గాయపడ్డారు.
#WATCH | Delhi: Union Home Minister Amit Shah says, "...If someone, by doing a cowardly attack, thinks that it is their big victory, then understand one thing, this is the Narendra Modi government, no one will be spared. It is our resolve to uproot terrorism from every inch of… pic.twitter.com/c4c4FPN17h
— ANI (@ANI) May 1, 2025