పోలీసులను టార్గెట్ చేసిన మావోయిస్టులు | Maoist targeted polices | Chhattisgarh | ASP Akash Rao |RTV
కరెంట్ షాక్తో పులి మృతి చెందిన ఘటన రాష్ట్రంలో కలకలం రేపుతోంది. ఆరేళ్లుగా కుమురంభీం ఆసిఫాబాద్ అడవుల్లో తిరుగుతున్న (K-8) ఆడపులి స్మగ్లర్లు అమర్చిన కరెంట్ తీగలకు బలైంది. 15 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఏపీ కడపలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెండ్లిమర్రి కొత్తూరు వద్ద వేగంగా వెళ్తున్న కంటైనర్ బైక్ ను ఢీ కొట్టింది. ముగ్గురు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. మృతులు వేంపల్లికి చెందినమల్లికార్జున, బాలయ్య, మల్లికార్జునగా గుర్తించి పోలీసులు కేసు నమోదు చేశారు.
హైదరాబాద్లో ఘోరం జరిగింది. జవహర్నగర్ డంపింగ్ యార్డు నిర్మాణ పనుల్లో అపశృతి చోటుచేసుకుంది. లిఫ్ట్ తెగిపడి ముగ్గురు యూపీ కార్మికులు దుర్మరణం చెందారు. పవర్ ప్లాంట్లో చిమ్నీ అమర్చుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు.
తెలంగాణలో విషాదం నెలకొంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గిరిజా ప్రియదర్శిని చనిపోయారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆదివారం కన్నుమూశారు. 2022లో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. ఆమె మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. సరదాగా ఈతకోసం వెళ్లిన నాగర్కర్నూల్ పెద్దకొత్తపల్లికి చెందిన ముగ్గురు పిల్లలు పోతుల చెరువులోపడి చనిపోయారు. గణేశ్, రక్షిత, శ్రావణ్ కుమార్ అకాల మరణంతో పేరెంట్స్, బంధువులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు.
బీహార్లో మరో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటుచేసుకుంది. రెండు కుటుంబాల భూ వివాదంలో 5 బాలుడు బలయ్యాడు. కిరాణ షాపుకు వెళ్లిన అన్మోల్ సింగ్ కొడుకును బాలకృష్ణ సింగ్ ఫ్యామిలీ బలవంతంగా ఎత్తుకెళ్లి కొట్టి చంపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఏపీ కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తునిలో బొలెరో వాహనం ఎదురుగా బైకుపై వస్తున్న యువకుడిపైకి దూసుకెళ్లింది. దీంతో రెండు వాహనాల మధ్య ఇరుక్కుని యువకుడు దుర్మరణం చెందాడు. మృతుడు అనకాపల్లి నామవరం శివగా గుర్తించారు.
ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు బర్డ్ఫ్లూతో భయపడుతోన్నాయి. మరోవైపు గులియన్ బారే సిండ్రోమ్ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్ర, కేరళ, పశ్చిమ బెంగాల్లలో ఈ వ్యాధి ఇప్పటికే తీవ్ర కలవరం పుట్టించింది. ఈ సిండ్రోమ్ తో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఒక్కో మహిళ మరణించారు.