HCA: పర్యవేక్షణ బాధ్యత జస్టిస్ నవీన్ రావుకు అప్పగించిన హైకోర్టు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పర్యవేక్షణ బాధ్యతలను జస్టిస్ నవీన్రావుకు అప్పగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన అనుమతి లేకుండా ఏదీ చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పర్యవేక్షణ బాధ్యతలను జస్టిస్ నవీన్రావుకు అప్పగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన అనుమతి లేకుండా ఏదీ చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది.
కోర్టు సమయాన్ని వృదా చేసినందుకు నలుగురికి న్యాయమూర్తి తగినబుద్ధి చెప్పారు. కోర్టు ధిక్కారానికి పాల్పడిన నలుగురు నిందితులకు ఢిల్లీ న్యాయస్థానం వినూత్న శిక్ష విధించింది. చేతులు పైకెత్తి కోర్టు హాలులో రోజంతా నిలబడాలని ఆదేశించింది.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి గట్టి షాక్ తగిలింది. హైదరాబాద్ హైటెక్సిటీకి దగ్గరలో ఉన్న ఖాజాగూడలో దాదాపు 27.18 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ నలుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు హైకోర్టులో ఇటీవలే పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
తెలంగాణ పోలీసులు, పోలీస్ట్ స్టేషన్లపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్ అడ్డాలుగా మారాయని అసహనం వ్యక్తం చేసింది. కోర్టు జారీచేసిన ఇంజంక్షన్ ఉత్తర్వులు ఉన్నప్పటికీ పోలీసులు జోక్యం చేసుకుంటున్నాయి.
సింగయ్య మృతి కేసులో ఏపీ మాజీ సీఎం జగన్ హైకోర్టును ఆశ్రయించారు. సింగయ్య మృతిపై హైకోర్టులో జగన్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన కేసులు కొట్టివేయాలని పిటిషన్ వేశారు. పిటిషన్ను రేపు విచారిస్తామని హైకోర్టు వెల్లడించింది.
స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. మూడు నెలల్లో అంటే సెప్టెంబర్ 30వ తేదీలోపు ఎన్నికలు నిర్వహించాలని జస్టిస్ టి. మాధవిదేవితో కూడిన బెంచ్ ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా వివిధ వర్గాలకు రిజర్వేషన్లు ఖరారు చేసి, ప్రకటించడానికి 30 రోజుల గడువు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. 30 రోజుల్లో తన బాధ్యతలను నెరవేర్చి రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలియజేస్తామని చెప్పింది.
కన్నడ భాష వివాదంలో కమల్ హాసన్ కి కర్ణాటక హైకోర్టు షాకిచ్చింది. ''ఎలాంటి ఆధారాలతో కన్నడ భాష గురించి ఆ వ్యాఖ్యలు చేశారు.. మీరేం చరిత్రకారుడా అని ప్రశ్నించింది. ఒక్క క్షమాపణ చెబితే సమస్య మొత్తం పరిష్కారం అవుతుందని న్యాయస్థానం తెలిపింది.''
ఏపీకి చెందిన డిప్యూటీ కలెక్టర్ తాతా మోహన్రావు హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కాదని కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు గాను ఆయనను తహసీల్దార్ స్థాయికి డిమోట్ చేయాలని ఆదేశించింది.