TG Government: జీపీవోలుగా మాజీ వీఆర్వోలు, వీఆర్ఏలు
గ్రామ పాలన అధికారులుగా మాజీ వీఆర్వోలు, వీఆర్ఏల నియామకంపై తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది.డిగ్రీ అర్హత ఉన్నటువంటి మాజీ వీఆర్వోలు, వీఆర్ఏలకు జీపీవోగా అవకాశం కల్పించనున్నట్లు సమాచారం.
గ్రామ పాలన అధికారులుగా మాజీ వీఆర్వోలు, వీఆర్ఏల నియామకంపై తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది.డిగ్రీ అర్హత ఉన్నటువంటి మాజీ వీఆర్వోలు, వీఆర్ఏలకు జీపీవోగా అవకాశం కల్పించనున్నట్లు సమాచారం.
తెలంగాణ ప్రభుత్వం నేడు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఉగాది కానుకగా సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో సన్నబియ్యం పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తారు.
తెలంగాణలో ప్రజలు ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ శాఖ రెండు మూడు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు.
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్న్యూస్ చెప్పారు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. మెట్రో సమయం పొడిగించినట్లుగా వెల్లడించారు. ఇప్పటివరకు రాత్రి 11 గంటల వరకు మాత్రమే ఉండగా.. ఇకపై రాత్రి 11.45 గంటల వరకు మెట్రో నడుస్తుందన్నారు.
తెలంగాణలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను విషయంలో వన్టైమ్ సెటిల్మెంట్కు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ప్రజలు సద్వినియోగం చేసుకోవడం వల్ల ఆస్తిపన్నుకు సంబంధించిన వసూళ్లు రూ.1000 కోట్లు దాటింది.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో తాజాగా హిమాచల్ప్రదేశ్తో విద్యుత్ ఒప్పందం చేసుకుంది. ‘తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ- 2025’ ఒప్పందం చేసుకున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు.
రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి కీలక ప్రకటన చేశారు. గత ఐదేళ్లలో పిడుగుపాటు, అగ్నిప్రమాదాల్లో చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారం అందిస్తామని వెల్లడించారు. పిడుగుపాటు మృతుల కుటుంబాలకు రూ.6 లక్షలు, అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.లక్షల పరిహారం అందిస్తామన్నారు.
కొత్త రేషన్ కార్డులకు ఎంతమందికి కావాలన్నా కూడా అర్హతను బట్టి ఇస్తున్నామని మంత్రి ఉత్తమ్ అన్నారు. కార్డు లేకపోయినా కూడా లబ్ధిదారుల జాబితాలో పేరు ఉన్నట్లయితే బియ్యం ఇస్తామని తెలిపారు.
పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడం కుదరదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. కృష్ణానదీ జలాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య వివాదం కోర్టులో ఉందని తెలిపింది. అందుకే జాతీయ హోదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర జల్శక్తి శాఖ స్పష్టం చేసింది.