Weather Update: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు బిగ్ అలర్ట్

ఏపీ, తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో ఆసిఫాబాద్‌, మంచిర్యాల, భూపాలపల్లి, ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురవనుండటంతో ఎల్లో అలర్ట్‌ను అధికారులు జారీ చేశారు. 

New Update
Rains

Rains

రుతుపవనాల వల్ల ప్రభావం వల్ల ఏపీ, తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. ముఖ్యంగా తెలంగాణలో ఆసిఫాబాద్‌, మంచిర్యాల, భూపాలపల్లి, ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురవనుండటంతో ఎల్లో అలర్ట్‌ను అధికారులు జారీ చేశారు. 

ఇది కూడా చూడండి: Woman Kills Husband: మామతో సరసాలు.. పెళ్లైన 45 రోజులకే భర్తను లేపేసింది

ఏపీలో ఈ జిల్లాల్లో..

నేడు ఏపీ(Andhra Pradesh)లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, అల్లూరి సీతారామరాజు, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం, కర్నూలులో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మృత్స్య కారులు వేటకు వెళ్లవద్దని సూచించారు.

ఇది కూడా చూడండి:China: మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధం.. రహస్యంగా మిలిటరీ నగరాన్ని నిర్మిస్తున్న చైనా !

తెలంగాణలో ఈ జిల్లాల్లో..
తెలంగాణలో ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్‌ భూపాలపల్లి, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్, నల్గొండ, కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. 

ఇది కూడా చూడండి:Oppo Reno 14 5G: అప్పు చేసైనా ఒప్పో కొనేయాలి భయ్యా.. 50MP+50MP కెమెరాతో కొత్త ఫోన్

Advertisment
Advertisment
తాజా కథనాలు