తొక్కిసలాట బాధిత కుటుంబాలకు విజయ్ వీడియో కాల్
కరూర్ తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 41 మంది కుటుంబాలకు టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ వీడియో కాల్ చేసి పరామర్శించారు. ఈ విషాద ఘటన జరిగిన దాదాపు పది రోజుల తర్వాత, మంగళవారం ఆయన బాధిత కుటుంబాలతో మాట్లాడి, వారిని ఓదార్చారు.