Manasa Sarovar: ఐదేళ్ల తర్వాత మానస సరోవర యాత్రకు ఓకే..భారత, చైనా సంబంధాల్లో కీలక మలుపు

చైనా అన్నిరకాలుగా భారత్ తో సంబంధాలు మెరుగు పరుచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా 85 వీసాలను మంజూరు చేసిన డ్రాగన్ కంట్రీ మరో కీకల మలుపుకు తెర తీసింది. ఐదేళ్ళుగా నిలిచిపోయిన మానస సరోవర యాత్రను తిరిగి ప్రారంభించడానికి రెండు దేశాలు అంగీకరించాయి. 

New Update
himalaya

Manasa sarovar Yatra

భారత్, చైనా మధ్య సంబంధాలలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సరిహద్దుల్లో ప్రతిష్టంభనతో 2019 తర్వాత ఆగిపోయిన కైలాస మానసరోవర్ యాత్రను తిరిగి ప్రారంభించడానికి ఇరు దేశాలూ అంగీకరించాయి.  అమెరికా మొదలెట్టిన వాణిజ్య యుద్ధం చైనా, భారత్ ల మధ్య ఉద్రిక్తతను తగ్గించడమే కాక...ఇరు దేశాల మధ్య కొత్త స్నేహానికి దారులు వేస్తోంది. ముఖ్యంగా చైనా...భారతతో స్నేహం కోసం తహతహలాడుతోంది. దీంట్లో భాగంగా భారతీయులు తమ దేశం రావాలని చైనా పిలుస్తోంది. దాని కోసం నాలుగు నెలల్లోనే 85 వీసాలను మంజూరు చేసింది. 

Also Read :  ఇదెక్కడి ఘోరం.. APలో 22 ఏళ్ల యువతికి.. 42 ఏళ్ల వ్యక్తితో పెళ్లి- బోరున ఏడుస్తున్న వధువు!

Also Read :  వైసీపీకి మరో దెబ్బ.. విశాఖ పీఠంపై కూటమి జెండా.. కాబోయే మేయర్ అతనే!

కరోనా తర్వాత..

ఇప్పుడు ఐదేళ్ళ తర్వాత మానస సరోవర్ యాత్రను పునరుద్ధరించారు.  హిమాలయాల్లోని కైలాస యాత్రను కరోనా వైరస్ టైమ్ లో ఆపేశారు. ఆ తర్వాత కరోనా తగ్గాక కూడా దాన్ని మొదలెట్టలేదు. గత రెండేళ్ళుగా ఇరు దేశాలు బార్డర్ గురించి కొట్టుకున్నాయి. చైనా భారత్ లోకి వచ్చి మరీ కొన్ని ప్రదేశాలను ఆక్రమించడానికి ప్రయత్నం చేసింది. ఆ దేశ నాయకులు కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. కానీ ఇప్పుడు వాటినన్నింటినీ పక్కన పెట్టేయాలని డ్రాగన్ కంట్రీ భావిస్తోంది. భారత్ తో సంబంధాలను బాగు చేసుకోవాలని ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా మానస సరోవర యాత్రను ప్రారంభించాలని రెండు దేశాలు అంగీకారానికి వచ్చాయి. యాత్ర పునరుద్దరణతొ రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉందని అంటున్నారు. కైలాస మానసరోవర్ యాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. ఈ యాత్ర పునఃప్రారంభం ఎదురు చూస్తున్న చాలా మందికి దీంతో గుడ్ న్యూస్ చెప్పినట్టయింది. 

Also Read :  బంగ్లాదేశ్ లో దారుణం.. హిందూ నేతను కిడ్నాప్ చంపేసిన దుండగులు!

మానస సరోవర యాత్ర సాధారణంగా జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో జరుగుతుంది. మిమాలయాల్లో ఆధ్యాత్మిక భావన పొందేందుకు ఇక్కడకు వెళ్ళాలని అనుకుంటారు. దీనిని రెండు మార్గాల ద్వారా నిర్వహిస్తారు. మొదటిది ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్ కనుమ మార్గం. ఇది 1981 నుంచి ఉంది. రెండోది సిక్కింలోని నాథులా కనుమ మార్గం. ఇది 2015లో ప్రారంభమైంది. ఈ రెండు మార్గాలు భక్తులకు దైవ అనుభూతిని కలిగించి.. ప్రకృతితో మమేకమయ్యే అవకాశాన్ని ఇస్తాయి. నాథులా కనుమ ద్వారా సరిహద్దు వాణిజ్యాన్ని పునరుద్ధరించడానికి కూడా భారత్, చైనా దేశాలు అంగీకరించాయి. సరిహద్దు ప్రాంతాల్లోని నదులపై సమాచార మార్పిడికి కూడా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

Also Read: ముందు మీ ఇంటిని చక్కదిద్దుకోండి..బంగ్లాకు కౌంటర్ ఇచ్చిన భారత్

 

china | himalayas | today-latest-news-in-telugu | national news in Telugu | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | breaking news in telugu | manasa sarovar

Advertisment
Advertisment
తాజా కథనాలు