Manasa Sarovar: ఐదేళ్ల తర్వాత మానస సరోవర యాత్రకు ఓకే..భారత, చైనా సంబంధాల్లో కీలక మలుపు
చైనా అన్నిరకాలుగా భారత్ తో సంబంధాలు మెరుగు పరుచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా 85 వీసాలను మంజూరు చేసిన డ్రాగన్ కంట్రీ మరో కీకల మలుపుకు తెర తీసింది. ఐదేళ్ళుగా నిలిచిపోయిన మానస సరోవర యాత్రను తిరిగి ప్రారంభించడానికి రెండు దేశాలు అంగీకరించాయి.