కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ చట్టం బెంగాల్ లో ఆందోళనలు రేపింది. అక్కడ తీవ్ర ఘర్షణలకు దారి తీసింది. అవి కాస్తా హింపకు దారి తీశాయి. ఇందులో ముగ్గురు చనిపోయారు. వందల మంది గాయాలపాలయ్యారు. ఇళ్లు, పోలీసు వాహనాలు తగులబడిపోయాయి. ఇవి ఎక్కువగా బ్గ్లాదేశ్ కు సరిహద్దులో ఉన్న ముర్షీదాబాద్ జిల్లాలోనే ఎక్కువగా జరిగాయి.
Also Read : వివాహేతర సంబంధం నేరం కాదు.. ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు!
మైనారిటీలకు పూర్తి భద్రత..
ఈ ఆందోళనలపై పక్క దేశం బంగ్లాదేశ్ అనవసరంగా కలుగజేసుకుంది. బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ ప్రెస్ సెక్రటరీ షఫికుల్ అలాం మాట్లాడుతూ.. భారత్లోని ముస్లిం మైనారిటీలకు పూర్తి భద్రత కల్పించాలని, ముర్షిదాబాద్ అల్లర్లకు బంగ్లాదేశ్కు ఎటువంటి సంబంధం లేదని అన్నారు. ముర్షిదాబాద్ అల్లర్లకు బంగ్లాదేశ్కు సంబంధం అంటగట్టే ఏ ప్రయత్నాలనైనా తాము గట్టిగా ఖండిస్తున్నామని షఫికుల్ అన్నారు.
Also Read : మే 2న కేదార్నాథ్ - 4న బద్రీనాథ్ ఆలయాలు ఓపెన్!
మీ పని మీరు చూసుకుంటే మంచిది..
దీనిపై భారత విదేశాంగ శాఖ కార్యదర్శి రణధీర్ జైస్వాల్ స్పందించారు. బంగ్లాదేశ్ తన దేశంలోని మైనారిటీల హక్కులను రక్షించడంపై దృష్టి సారిస్తే మంచిది అంటూ కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. బంగ్లాదేశ్ వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామని..స్నేహం ముసుగులో తమపై విమర్శ చేసే ఒప్పుకోమని అన్నారు. తమ దేశంలో మైనారిటీలపై జరుగుతున్న అన్యాయాలను దాచేందుకు భారత్ పై నిందలు వేయడం కరెక్ట్ కాదని రణధీర్ అన్నారు. సంబంధం లేని వ్యాఖ్యలు చేయడం, నైతికత పరంగా గొప్పగా ప్రవర్తిస్తున్నట్టు చూపించడం గొప్ప విషయం అనిపించుకోదని ఆయన హితవు పలికారు. గతేడాది జులై నుంచి బంగ్లాదేశ్లో మైనార్టీలపై దాడులు జరుగుతోన్న విషయం అందరికీ తెలిసిందే. అక్కడ హిందువులపై తీవ్ర దాడులు జరిగాయి.
Also Read: Toll: మే 1 నుంచి శాటిలైట్ టోల్..కేంద్రం క్లారిటీ
Also Read : జేఈఈ (మెయిన్) సెషన్ 2 రిజల్ట్స్ వచ్చేశాయి!
bangladesh | india | west bengal | today-latest-news-in-telugu | Waqf Amendment Act | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | breaking news in telugu | national news in Telugu
Ind-Bangla: ముందు మీ ఇంటిని చక్కదిద్దుకోండి..బంగ్లాకు కౌంటర్ ఇచ్చిన భారత్
వక్ఫ్ చట్టం పశ్చిమ బెంగాల్ లో ఆందోళనలు, ఘర్షణలుకు దారి తీసింది. దీనిపై పక్కనే ఉన్న బంగ్లాదేశ్ మాట్లాడుతూ ముస్లిం మైనారిటీలకు భద్రత కల్పించాలని వ్యాఖ్యలు చేసింది. దీనికి ప్రతిగా ముందు మీ దేశం గురించి మీరు చూసుకుంటే మంచిదంటే భారత్ కౌంటరిచ్చింది.
Waqf Amendement Bill
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ చట్టం బెంగాల్ లో ఆందోళనలు రేపింది. అక్కడ తీవ్ర ఘర్షణలకు దారి తీసింది. అవి కాస్తా హింపకు దారి తీశాయి. ఇందులో ముగ్గురు చనిపోయారు. వందల మంది గాయాలపాలయ్యారు. ఇళ్లు, పోలీసు వాహనాలు తగులబడిపోయాయి. ఇవి ఎక్కువగా బ్గ్లాదేశ్ కు సరిహద్దులో ఉన్న ముర్షీదాబాద్ జిల్లాలోనే ఎక్కువగా జరిగాయి.
Also Read : వివాహేతర సంబంధం నేరం కాదు.. ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు!
మైనారిటీలకు పూర్తి భద్రత..
ఈ ఆందోళనలపై పక్క దేశం బంగ్లాదేశ్ అనవసరంగా కలుగజేసుకుంది. బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ ప్రెస్ సెక్రటరీ షఫికుల్ అలాం మాట్లాడుతూ.. భారత్లోని ముస్లిం మైనారిటీలకు పూర్తి భద్రత కల్పించాలని, ముర్షిదాబాద్ అల్లర్లకు బంగ్లాదేశ్కు ఎటువంటి సంబంధం లేదని అన్నారు. ముర్షిదాబాద్ అల్లర్లకు బంగ్లాదేశ్కు సంబంధం అంటగట్టే ఏ ప్రయత్నాలనైనా తాము గట్టిగా ఖండిస్తున్నామని షఫికుల్ అన్నారు.
Also Read : మే 2న కేదార్నాథ్ - 4న బద్రీనాథ్ ఆలయాలు ఓపెన్!
మీ పని మీరు చూసుకుంటే మంచిది..
దీనిపై భారత విదేశాంగ శాఖ కార్యదర్శి రణధీర్ జైస్వాల్ స్పందించారు. బంగ్లాదేశ్ తన దేశంలోని మైనారిటీల హక్కులను రక్షించడంపై దృష్టి సారిస్తే మంచిది అంటూ కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. బంగ్లాదేశ్ వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామని..స్నేహం ముసుగులో తమపై విమర్శ చేసే ఒప్పుకోమని అన్నారు. తమ దేశంలో మైనారిటీలపై జరుగుతున్న అన్యాయాలను దాచేందుకు భారత్ పై నిందలు వేయడం కరెక్ట్ కాదని రణధీర్ అన్నారు. సంబంధం లేని వ్యాఖ్యలు చేయడం, నైతికత పరంగా గొప్పగా ప్రవర్తిస్తున్నట్టు చూపించడం గొప్ప విషయం అనిపించుకోదని ఆయన హితవు పలికారు. గతేడాది జులై నుంచి బంగ్లాదేశ్లో మైనార్టీలపై దాడులు జరుగుతోన్న విషయం అందరికీ తెలిసిందే. అక్కడ హిందువులపై తీవ్ర దాడులు జరిగాయి.
Also Read: Toll: మే 1 నుంచి శాటిలైట్ టోల్..కేంద్రం క్లారిటీ
Also Read : జేఈఈ (మెయిన్) సెషన్ 2 రిజల్ట్స్ వచ్చేశాయి!
bangladesh | india | west bengal | today-latest-news-in-telugu | Waqf Amendment Act | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | breaking news in telugu | national news in Telugu