Amit Shah: కేంద్రం సంచలన నిర్ణయం.. భారత్ నుంచి 16 వేల మంది విదేశీయులు ఔట్ !
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి 16 వేల మంది విదేశీయులను బహిష్కరించనుంది. ప్రభుత్వ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. దేశంలో ఇటీవల కొత్త వలస చట్టాలు అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. వాటి ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.