HBD Pawan Kalyan: ప్లాపులు వచ్చిన తగ్గని పవర్... జనం మెచ్చిన స్టార్!
నేడు ఆంద్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన సినీ, పొలిటికల్ కెరీర్ గురించి మరోసారి ఇక్కడ గుర్తుచేసుకుందాం..
నేడు ఆంద్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన సినీ, పొలిటికల్ కెరీర్ గురించి మరోసారి ఇక్కడ గుర్తుచేసుకుందాం..
ప్రముఖ టీవీఛానల్ లో ప్రచారమయ్యే కామెడీ షో జబర్దస్త్ ద్వారా బల్లితెరకు పరిచయమైన నటి రీతూ చౌదరి బిగ్బాస్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా గుర్తింపు పొందిన రీతుచౌదరి తన గ్లామర్ తో వందలాది మంది అభిమానులను సంపాదించుకుంది.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సీఎం చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. "మిత్రులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని తెలిపారు.
ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా నేడు, బుధవారం కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడించింది.
చంద్రబాబు నాయుడు తొలిసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 30 ఏళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో చేపట్టిన కార్యక్రమాలను గుర్తు చేస్తూ అప్పటి ఫొటోలను షేర్ చేస్తున్నారు.
విశాఖలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ ఫార్మా కంపెనీ డైరక్టర్ ఆత్మహత్య కలకలం రేపింది. స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వసుధ ఫార్మా కంపెనీ డైరక్టర్ మంతెన వెంకట సూర్య నాగ వర ప్రసాద్ రాజు సూసైడ్ చేసుకున్నారు.
మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని భార్యను అతికిరాతకంగా హతమార్చాడు ఓ కసాయి భర్త. తాగుడుకు డబ్బులు ఇవ్వలేదని భార్య గొంతుకు మిక్సీ వైరు బిగించి హత్య చేశాడు.ఈ ఘటన ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాలో కలకలం రేపింది.
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో గణేష్ నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ట్రాక్టర్ డ్రైవర్ మధ్యలో దిగడంతో మరో యువకుడు నేర్చుకోవడానికి నడపగా దూసుకెళ్లి స్పాట్లోనే నలుగురు మృతి చెందారు. అల్లూరి సీతారామరాజులో ఇలాంటి ఘటన జరిగి ఇద్దరు మృతి చెందారు.
చిత్తూరులో వినాయక చవితి ఉత్సవాల్లో రికార్డింగ్ డాన్సులు నిర్వహించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. చిత్తూరు జిల్లా పలమనేరులోని టి. వడ్డూరు గ్రామంలో వినాయక మండపాల వద్ద అసభ్యకర నృత్యాల ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.