/rtv/media/media_files/2025/06/11/q88LvVBqq0QcfXEVTwgv.jpg)
బీఆర్ఎస్లో కవిత లేఖ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. లేఖ వివాదం తర్వాత మొదటి సారి కవిత ఆమె భర్తతో కలిసి కేసీఆర్ను కలిశారు. ఎర్రవల్లి ఫామ్హౌస్కు వెళ్లి బుధవారం ఉదయం తండ్రి కేసీఆర్తో కవిత భేటీ అయ్యారు. ఇక హరీశ్ రావు కూడా నిన్నటి నుంచి ఫాంహౌస్లోనే ఉన్నారు. మరికాసేపట్లో కేసీఆర్ కాళేశ్వరం విచారణకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో కవిత, కేసీఆర్ ల భేటీ చర్చనీయాంశంగా మరింది. ఉదయం 9గంటలకు ఎర్రవల్లి నుంచి హైదరాబాద్లోని బీఆర్కే భవన్కు బయలుదేరనున్నారు.
Also Read : బాలయ్య డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి కన్నుమూత
Kavitha Visits KCR Farmhouse
ఎర్రవల్లి ఫామ్హౌస్కి వెళ్లిన ఎమ్మెల్సీ కవిత.. లేఖ వివాదం తర్వాత తొలిసారి ఫామ్హౌస్కి కవిత.. ఇవాళ కాళేశ్వరం కమిషన్ ముందుకు మాజీ సీఎం కేసీఆర్.. బీఆర్కే భవన్లో కేసీఆర్ను ప్రశ్నించనున్న పీసీ ఘోష్ కమిషన్.. విచారణ కమిషన్ను ఎదుర్కోబోతున్న తొలి మాజీ సీఎం కేసీఆర్#KCR pic.twitter.com/VPwLfoBONw
— Telugu King (@dootha4662) June 11, 2025
Also Read : నా రాజకీయ ప్రయాణం ఇదే.. రాజగోపాల్ రెడ్డి సంచలన ప్రకటన!
తండ్రి కేసీఆర్ని చూసి ఆమె భావోద్వేకానికి గురైంది. భర్త అనిల్తో కలిసి కవిత ఫాంహౌస్కు వచ్చింది. కాళేశ్వరం కమిషన్ విచారణకు ముందు భేటీపై ఉత్కంఠ రేపుతుంది. కేసీఆర్తో కలిసి భారీ కాన్వాయ్తో హైదరాబాద్కు కవిత, హరీశ్ లు హైదరాబాద్ బయలుదేరనున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కేటీఆర్ కొడుకు హిమాన్షు కూడా ఫాంహౌస్కు చేరుకున్నారు.
Also Read : ప్రముఖ సింగర్ బర్త్ డే పార్టీలో డ్రగ్స్ కలకలం!
Also Read : భయపెడుతున్న కరోనా భూతం..ప్రధాని కేబినెట్ మీటింగ్ హాజరుకూ పరీక్షలు తప్పనిసరి
brs | cbi-enquiry-on-kaleshwaram | latest-telugu-news | today-news-in-telugu | latest telangana news | telangana news today | telangana-news-updates | telangana politics today