/rtv/media/media_files/2025/05/14/W5V7cYqMjsrfVDs6mcov.jpg)
BREAKING NEWS
Hyderabad Drugs: హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. చేవెళ్ల త్రిపుర రిసార్ట్ లో జరిగిన ప్రముఖ ఫోక్ సింగర్ బర్త్ డే పార్టీలో పలువురు గంజాయి తీసుకున్నట్లు పరీక్షల్లో తేలింది. రిసార్ట్ పై దాడులు చేసిన పోలీసులు అక్కడ విదేశీ మద్యాన్ని కూడా సీజ్ చేశారు. ఈ ఘటనపై చేవెళ్ల పీఎస్ లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఆ ప్రముఖ సింగర్ ఎవరనేది? ఇంకా బయటకి రాలేదు. అలాగే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.