Covid : భయపెడుతున్న కరోనా భూతం..ప్రధాని కేబినెట్ మీటింగ్ హాజరుకూ పరీక్షలు తప్పనిసరి

దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మళ్ళీ పాత రోజులు వస్తాయేమో అన్న భయాన్ని కలిగిస్తున్నాయి. దీంతో అందరూ ముందు జాగ్రత్తలు పాటిస్తున్నారు. తాజాగా ప్రధాని మోడీ కేబినెట్ మీటింగ్ కు హాజరుకావాలంటే కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందే అని రూల్ పెట్టారు.

New Update
delhi

central cabinet meeting

భారత్ లో కోవిడ్ వేగంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు దాదాపు 7 వేల కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ప్రస్తుతం ఢిల్లీ, మహారాష్ట్ర ల్లో ఎక్కువగా కోవిడ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో ప్రతీ చోటా కరోనా నివారణ చర్యలను ప్రారంభించారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఒక నిర్ణయాన్ని తీసుకుంది. ప్రధాని అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశాలకు కోవిడ్ పరీక్షలు తప్పనిసరి చేసింది. ఈరోజు జరగనున్న క్యాబినెట్ సమావేశానికి హాజరయ్యే మంత్రులందరికీ ఆర్టీ-పీసీఆర్ పరీక్ష తప్పనిసరిగా చేయనున్నారు. 

7 వేలకు చేరువలో కోవిడ్ కేసులు..

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఈ వైరస్‌ సోకిన వారి సంఖ్య 6 వేలు దాటింది. ఇప్పటిదాకా కరోనాతో దేశవ్యాప్తంగా 65 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. ఈ డేటా ప్రకారం చూసుకుంటే.. జూన్ 8న ఉదయం 8 గంటలకు దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 6,133లకు చేరింది. గత 24 గంటల్లో 378 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆరుగురు మృతి చెందారు.   కేరళలో అత్యధికంగా 1950 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. డేటాబోర్డులో చెప్పిన సమాచారం ప్రకారం.. కేరళలో 1950, గుజరాత్ 822, పశ్చిమ బెంగాల్ 693, ఢిల్లీ 686, మహారాష్ట్ర 595, కర్ణాటక 366, ఉత్తరప్రదేశ్‌ 219, తమిళనాడు 194 కేసులతో పాటు ఇంకా ఇతర రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. అయితే అరుణాచల్‌ప్రదేశ్‌, మిజోరాంలో మాత్రం ఎలాంటి కేసులు నమోదు కాలేదు.     

 

Also Read: Sonam Raghu Vamsi: భర్త హత్యకు 20 లక్షల సుపారీ..తానే స్వయంగా డెడ్ బాడీని తోసేసిన సోనమ్

Advertisment
Advertisment
తాజా కథనాలు