Komatireddy Rajgopal Reddy: నా రాజకీయ ప్రయాణం ఇదే.. రాజగోపాల్ రెడ్డి సంచలన ప్రకటన!

తెలంగాణ కేెబినెట్ విస్తరణపై కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి స్పందించారు. మంత్రి బాధ్యతలు చేపట్టిన వారికి అభినందనలు తెలిపారు. నా రాజకీయ ప్రయాణం ఇక్కడితో ఆగదు. పదవి లేకున్నా పనిచేసే అవకాశం శక్తివంతంగా ఉంటుంది. ఆయన మార్గాన్ని ఎంచుకున్నానని పేర్కొన్నారు.

New Update
raj gopal reddy

కేబినెట్ విస్తరణపై ఎట్టకేలకు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాజ్‌గోపాల్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ జరిగితే మొదటగా నాకే పదవి దక్కుతుందని ఆశాబావం వ్యక్తం చేశారు. కానీ ఆయన ఊహలకు విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు. దీంతో ఆయన కొన్ని రోజులుగా ఆ పార్టీ పెద్దలకు టచ్‌లోకి రాలేదు. ఈరోజు ఆయన అలకవీడారు. మంత్రి పదవిలో ఉన్నా లేకున్నా  పార్టీని బలపరిచే ప్రయత్నాల్లో, ప్రజల మద్దతుతో ముందుకు సాగుతాని ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సోషల్ మీడియాలో ఇలా రాసుకొచ్చారు. తెలంగాణ కేబినెట్‌లో నూతనంగా నియమితులైన మంత్రులను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాని పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయడంలో వారికి సంపూర్ణ విజయం కోరుకుంటున్నాను. తన వరకూ రాజకీయాలు అంటే పదవులు, అధికారాలు కాదని స్పష్టం చేశారు రాజ్ గోపాల్ రెడ్డి. ప్రజల పట్ల నా నిబద్ధత, తెలంగాణ పునర్నిర్మాణం పట్ల నా కలలే నాకు ప్రేరణగా నిలిచాయి. అదే కారణంగా నేనే తిరిగి కాంగ్రెస్ పార్టీకి వచ్చానని మునుగోడు ఎమ్మెల్యే అన్నారు. ప్రజల సమస్యలు వినడంలో, వారి హక్కుల కోసం పోరాడడంలో, వారి గొంతుకను ప్రభుత్వం వరకు తీసుకెళ్లడంలో నేను ఎప్పటికీ ముందుంటాను. నా రాజకీయ ప్రయాణం ఇక్కడితో ఆగదు. కొన్నిసార్లు, పదవి లేకుండానే ప్రజల మధ్య పనిచేసే అవకాశం ఎంతో శక్తివంతంగా మారుతుంది. అదే మార్గాన్ని నేను ఎంచుకున్నానని ఆయన ఇన్‌గ్రామ్ అకౌంట్‌లో పేర్కొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు