Bandi Sanjay: బీఆర్ఎస్‌ను బీజేపీతో కలిపేందుకు చూశారు: బండి సంజయ్

కవిత వ్యవహారం అంతా ఓ ఫ్యామిలీ డ్రామా అని బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ఎప్పుడూ కలవవని అన్నారు. కవిత అరెస్టు అవ్వకుండా ఉండేందుకు బీఆర్‌ఎస్ పార్టీ బీజేపీతో కలిసేందుకు యత్నించిందని తెలిపారు.

New Update
Bandi Sanjay

Bandi Sanjay

బీఆర్‌ఎస్‌ను బీజేపీలో కలపాలనే ప్రతిపాదనను తీసుకొచ్చారని ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వ్యవహారం చర్చనీయాంశమవుతున్న నేపథ్యంలో తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌లో చార్‌పత్తా ఆట నడుస్తోందని.. కవిత వ్యవహారం అంతా ఓ ఫ్యామిలీ డ్రామా అని ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో కల్వకుంట్ల ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ డ్రామా జరుగుతోందని సెటైర్లు వేశారు. 

Also Read: పాక్‌కు గూఢచర్యం..మరో ఇంటిదొంగ అరెస్ట్‌... భారత యుద్ధ నౌకల సమాచారం చేరవేసిన ఇంజినీర్

Bandi Sanjay Comments On MLC Kavita Issue

కల్వకుంట్ల సినిమాకు కాంగ్రెస్ ప్రొడక్షన్ చేస్తోందని విమర్శించారు. అలగా బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ఎప్పుడూ కలవవని అన్నారు. కవిత అరెస్టు అవ్వకుండా ఉండేందుకు బీఆర్‌ఎస్ పార్టీ బీజేపీతో కలిసేందుకు యత్నించిందని తెలిపారు. అవినీతి బీఆర్ఎస్‌ పార్టీతో బీజేపీ కలవదని.. కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ కలిసి పనిచేశాయని పేర్కొన్నారు. మరోవైపు వేములవాడ రాజన్న గోశాలలో కొడెలు మరణించడం బాధాకర విషయమన్నారు. 

Also Read: టర్కీతో మరో తెగతెంపులు..టర్కిష్ ఎయిర్ లైన్స్ తో భాగస్వామ్యం రద్దు

ఈ విషయంపై వేములవాడ రాజన్న ఆలయ ఈవోతో మాట్లాడినట్లు తెలిపారు. కోడెల సంఖ్యకు అనుగుణంగా గోశాలను విస్తరించాలని బండి సంజయ్‌ సూచనలు చేశారు. రాజన్న ఆలయం నిధులను సీఎం రేవంత్ వేరే చోట ఖర్చు చేశారని ఆరోపణలు చేశారు. అలాగే ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు ఆర్మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా ఉందన్నారు. పాకిస్థాన్‌పై యుద్ధం ఇంకా కొనసాగుతోందని ప్రధాని మోదీ చెప్పినట్లు గుర్తించారు.    

Also Read: ప్రపంచం చూపులన్నీ HITEX మీదే! ఈరోజు గ్రాండ్ ఫినాలే హైలైట్స్ ఇవే

Also Read: మనదేశం ఏమైనా పర్వాలేదా? సన్నియాదవ్‌ పై ప్రపంచ యాత్రికుడు ఫైర్‌

Bandi Sanjay | kavita | telangana | latest-telugu-news | today-news-in-telugu | latest telangana news | telangana news today | telangana-news-updates

Advertisment
Advertisment
తాజా కథనాలు