Miss World 2025: ప్రపంచం చూపులన్నీ HITEX మీదే! ఈరోజు గ్రాండ్ ఫినాలే హైలైట్స్ ఇవే

మిస్ వరల్డ్ 2025 గ్రాండ్ ఫినాలే హైదరాబాద్‌లోని హైటెక్స్ లో ఈరోజు సాయంత్రం గ్రాండ్ గా ప్రారంభంమవుతుంది. 40 మంది ఫైనలిస్టులు, రెడ్ కార్పెట్ షో, సెలబ్రిటీల సందడితో వేదికగా సందడిగా మారనుంది. ఈ ఈవెంట్ కి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

New Update

Miss World 2025: తెలంగాణ, హైదరాబాద్ వేదికగా జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 అందాల పోటీలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఈరోజుతో ప్రపంచ సుందరి కిరీటం సొంతం చేసుకోబోయేది ఎవరో తేలిపోతుంది. హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో గ్రాండ్ ఫినాలే ఈవెంట్ కి సర్వం సిద్ధమైంది. మిస్ వరల్డ్ చరిత్రలోనే మొదటిసారిగా ఇంత గ్రాండ్‌గా జరుగుతోంది. నాలుగు ఖండాల నుంచి  109 దేశాల మోడల్స్ ఈ అందాల పోటీలో పాల్గొనగా..  చివరిగా 40 మంది కంటెస్టెంట్లు ఫైనలిస్టులుగా తుది పోటీలకు ఎంపికయ్యారు.  ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు క్వార్టర్, సెమీఫైనల్, ఫైనల్ రౌండ్లు జరుగుతాయి. 

ఈ గ్రాండ్ ఈవెంట్‌ ని SonyLIV యాప్‌లో లైవ్‌గా చూడవచ్చు. లేదా watchmissworld.com వెబ్‌సైట్‌లో HD లో గ్లోబల్ స్ట్రీమింగ్ ఉంటుంది. అంతేకాదు 100 పైగా దేశాల్లో ఈవెంట్ ప్రసారం అవుతుంది. 

ముఖ్య అతిథులు 

ఈ వేడుకలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మిస్ వరల్డ్ ఛైర్మెన్  జూలియా మార్లే, ప్రస్తుత మిస్ వరల్డ్ క్రిస్టినా పిజ్‌కోవా ముఖ్య అతిథులుగా  హాజరుకానున్నారు. క్రిస్టినా కొత్త మిస్ వరల్డ్‌కు కిరీటాన్ని అందజేస్తారు. 

Also Read :  Jubilee Hills Pub: జూబ్లీహిల్స్‌‌ పబ్‌‌లో లైట్లు ఆర్పి.. మహిళలపై అరాచకం

ప్రత్యేక హైలైట్స్

  • ఈ వేడుకకు మొత్తం 3,500 మంది ప్రేక్షకులు హాజరు కానున్నారు.
  • జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఇషాన్ కట్టర్ లైవ్ పర్ఫార్మెన్స్  ఉంటుంది.
  •  400 మంది పైగా  ప్రత్యేక అతిథులు రెడ్ కార్పెట్ పై మెరవనున్నారు.
  • మిస్ వరల్డ్ 2017 మనుషి చిల్లర్ ప్రత్యేక అతిథిగా హాజరవుతారు.
  • నటుడు సోను సూద్‌కు మిస్ వరల్డ్ హ్యూమానిటేరియన్ అవార్డు ప్రదానం చేస్తారు.
  • జడ్జిలుగా సోను సూద్, సుధా రెడ్డి, డాక్టర్ కరీనా టురెల్, జూలియా మార్లే పాల్గొంటారు.

భారీ ఏర్పాట్లు 

ఫైనలేకు హాజరైన ప్రేక్షకులకు, అతిథులకు  ప్రజలకు సౌకర్యంగా ఉండేందుకు పార్కింగ్, సెక్యూరిటీ, ఫుడ్,  వంటి అంశాలపై  ప్రత్యేక శ్రద్ధ వహించారు. భుత్వ హాస్పిటాలిటీ ఇన్ స్టిట్యూట్ల నుంచి 60 మంది ట్రైన్డ్ వాలంటీర్లు సహాయానికి సిద్ధంగా ఉన్నారు. భద్రత చర్యల దృష్ట్యా శనివారం 5 నుంచి 7 గంటల మధ్య,  9 నుంచి 10 గంటల మధ్య కొన్ని రహదారులను తాత్కాలికంగా మూసివేయనున్నట్లు తెలుస్తోంది.

Also Read :  ఇదిరా పవర్ స్టార్ లుక్ అంటే.. ‘OG’ నుంచి కొత్త వీడియో అదిరిపోయిందెహే

Advertisment
Advertisment
తాజా కథనాలు