/rtv/media/media_files/2025/05/12/eBNuYyD9qgkOoF1bBlTh.jpg)
pakistan spy network
Thane Engineer : తల్లిపాలు తాగి తల్లి గుండెలమీదే గుద్దినట్లు.. ఈ దేశంలో ఉంటూ ఈ దేశం తిండి తింటూ పరాయి దేశానికి దేశ అంతర్గత సమాచారాన్ని మోస్తున్నారు కొంతమంది దేశద్రోహులు. ఉగ్రవాదుల కంటే దుర్మర్గంగా వ్యవహరిస్తున్న ఇంటిదొంగలు ఒక్కరొక్కరే పట్టుబడుతున్నారు. తాజాగా భారత యుద్ధ నౌకల సమాచారం పాకిస్థానీ నిఘా ఏజెంట్లకు అందజేసిన మహారాష్ట్ర కు చెందిన యువకుడు రవీంద్ర వర్మను పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్థాన్ ఏజెంట్ల పన్నిన ఉచ్చులో పడిన అతడు యుద్ధ నౌకలు, జలాంతర్గాములకు చెందిన రహస్యాలను చేరవేశాడని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: మూడు రాత్రులు.. గుండెపోటుకు కారణం.. షాకింగ్ నిజాలు
థానే కు చెందిన రవీంద్ర వర్మ మెకానికల్ ఇంజినీర్ చేశాడు. ఓ ప్రైవేటు రక్షణ రంగ టెక్నాలజీ సంస్థలో పని చేసేవాడు. కొంతమంది పాక్ ఏజెంట్లు ఫేస్బుక్ ద్వారా అతడికి పరిచయమయ్యారు. వారు రవీంద్రతో తమను తాము యువతులుగా పరిచయం చేసుకున్నారు. 2024లో పాయల్ శర్మ, ఇస్ప్రీత్ పేరిట ఉన్న ఫేస్బుక్ల నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్లు వచ్చాక అతడు పాక్ ఏజెంట్లతో టచ్లోకి వచ్చాడని పోలీసులు తెలిపారు.ఈ క్రమంలో రవీంద్రవర్మ ఏం ఉద్యోగం చేస్తున్నాడో తెలుసుకున్నారు. వర్మ రక్షణ రంగ సంస్థ ఉద్యోగి కావడంతో వర్మకు యుద్ధనౌకలు, జలాంతర్గాముల్లోకి వెళ్లేందుకు అనుమతి ఉంది. అతడు తన వద్ద ఉన్న సెల్ఫోన్ లో అన్ని రికార్డు చేసేవాడు. తన విధులు పూర్తి చేశాక, నౌకలకు సంబంధించిన గోప్యమైన సమాచారాన్ని సేకరించి పాక్ ఏజెంట్లకు అందించేవాడు. కొన్ని సార్లు ఆడియో రూపంలో కూడా సీక్రెట్ సమాచారాన్ని చేరవేసేవాడు.
Also Read: ఇండియాలో సివిల్ డిఫెన్స్ మాక్డ్రిల్ వాయిదా.. ఎందుకంటే?
పాక్ ఏజెంట్లు ఇద్దరూ తమని తాము భారతీయ మహిళలుగా పరిచయం చేసుకున్నారు. అది నమ్మిన రవీంద్ర వారి వలలో పడ్డాడు. తాము పనిచేస్తున్న ప్రాజెక్టు కోసం భారత యుద్ధ నౌకలకు సంబంధించిన సమాచారం కావాలని వారు కోరారు. ఇక పాక్ ఎజెంట్లకు వర్మ పంపించిన సమాచారానికి అతడికి భారత్లోని వివిధ బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బులు బదిలీ అయ్యేవని కూడా పోలీసులు గుర్తించారు. కాగా రవీంద్రను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Also Read: ఓటమి ఒప్పుకున్న పాక్ ప్రధాని.. మీడియా ముందు షాకింగ్ కామెంట్స్