/rtv/media/media_files/2025/05/31/dBKxVEvQRDUdDSJk2e4V.jpg)
Naa Anveshana
Naa Anveshana: బైక్ రైడర్, యూట్యూబర్ భయ్యా సన్నీయాదవ్కు మనదేశం ఏమైపోయినా పర్వాలేదని డబ్బులు వస్తే చాలనుకుంటున్నాడని యూట్యూబర్ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ మండిపడ్డారు. కాగా సన్నీ యాదవ్ను ఇటీవల చైన్నై ఎయిర్పోర్టులో ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అన్వేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. భయ్యా సన్నీయాదవ్ పాకిస్థాన్ వెళ్లి వచ్చిన తరవాత ఏప్రిల్ 10వ తేదీన పహెల్గామ్ ఎటాక్ జరిగిందని అన్నారు. ఆ అటాక్ తర్వాత ఎక్కువ వ్యూస్ వస్తాయని పాకిస్థాన్ వీడియోలు అప్లోడ్ చేశాడని ఆరోపించారు. పాకిస్థాన్ మన శతృదేశం అన్న విషయాన్ని కూడా మరిచిపోయి భయ్యా సన్నీయాదవ్ ఆ దేశాన్ని చూపించడం కల అని చెప్పుకుంటున్నాడని మండిపడ్డారు. భన్నీ సన్నీయాదవ్కు దేశం ఏం అయిపోయినా పర్వాలేదని డబ్బులు వస్తే చాలని పైర్ అయ్యాడు.
Also Read: పాకిస్తాన్ గేమ్ క్లోస్.. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ డిమాండ్ ఏంటంటే?
ఇటీవల యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను కూడా ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారని చెప్పారు. పహెల్గాం దాడి సమయంలో పాకిస్థాన్ వెళ్లొచ్చిన అందరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని, జ్యోతి మల్హోత్రా గూడచారిగా మారినట్టు విచారణలో నిర్దారణ అయ్యిందని చెప్పారు. అలాంటిది సన్నీయాదవ్ రెండు నెలల పాటు పాకిస్థాన్లో ఉన్నాడని, నిషేధిత ప్రదేశాల్లో తిరిగాడని చెప్పాడు. అతడు స్పైగా పనిచేస్తున్నాడా లేదా అనేది విచారణలో తేలుతుందని అన్నాడు. డబ్బుల కోసమే పాకిస్థాన్ వీడియోలు అప్లోడ్ చేశాడని తెలిపాడు.సన్నీయాదవ్కు ఆరు అంతస్తుల ఇల్లు ఉంది, జాగ్వార్ కారుతో పాటూ విలువైన బైకులు ఉన్నాయి. ఆ డబ్బు ఎక్కడ నుండి వచ్చిందని ఎన్ఐఏ ప్రశ్నిస్తుందని అన్వేష్ తెలిపాడు. సన్నీయాదవ్ డబ్బంతా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ద్వారానే సంపాదించాడని ఆరోపించారు.
Also Read: బుద్ధి మార్చుకోని పాక్.. పుల్వామా తరహా దాడికి స్కెచ్.. ఇదిగో ప్రూఫ్!
పాకిస్థాన్ వెళ్లడానికి గతంలో అనుమతి లేదని, 5 నెలల క్రితం పాకిస్థాన్ వెళ్లడానికి భారత యూట్యూబర్లకు అవకాశాలు వచ్చాయని తెలిపారు. పాకిస్థాన్ ఆర్థికంగా చితికిపోయిన తరవాతనే భారత యూట్యూబర్లకు అనుమతి ఇచ్చిందన్నారు. తనకు కూడా అవకాశం వచ్చిందని, కానీ శతృదేశానికి వెళ్లడం ఇష్టం లేకనే వెళ్లలేదని చెప్పుకొచ్చాడు. మరో శతృదేశం అజర్ బైజాన్ కు వెళ్లినా కూడా ఆ దేశ వీడియోలు డిలీట్ చేశానని చెప్పారు. పాకిస్థాన్తో యుద్దం సమయంలో ఆ దేశానికి సపోర్ట్ చేసిన కారణాంగానే టర్కీ, అజర్ బైజాన్ వీడియోలు డిలీట్ చేశానని స్పష్టం చేశారు. వ్యూస్ వస్తున్నాయని పాకిస్థాన్ వీసాలు రాగానే యూట్యూబర్లు వెళ్లొద్దని హెచ్చరించారు. అలా వెళితే తర్వాత ఇబ్బందులు తప్పవని హెచ్చరించాడు.