Uttarakhand floods: 28 మంది కేరళ టూరిస్టులు గల్లంతు
ఉత్తరకాశీ జిల్లా ధరాళి గ్రామంలో చోటుచేసుకున్న వరదల్లో కేరళకు చెందిన 28 మంది పర్యాటకులు గల్లంతైయ్యారు. గంగోత్రికి వెళ్లే మార్గంలో ధరాళి గ్రామం ఉంది. మంగళవారం మధ్యాహ్నం క్లౌడ్ బరస్ట్ సంభవించడంతో నదిలో నీటి మట్టం ఒక్కసారిగా పెరిగి గ్రామాన్ని ముంచెత్తింది.