BIG Breaking: ఉత్తరాఖండ్ లో మళ్ళీ క్లౌడ్ బరస్ట్..చమోలీ జిల్లాలో 10 మంది గల్లంతు
ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లాను మళ్ళీ వరదలు ముంచెత్తాయి. బుధవారం రాత్రి నందానగర్ లో ఆకస్మిక వరదలు కారణంగా 10 మంది గల్లంతయ్యారు. చాలా ఇళ్ళు కొట్టుకుపోయాయని తెలుస్తోంది.
ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లాను మళ్ళీ వరదలు ముంచెత్తాయి. బుధవారం రాత్రి నందానగర్ లో ఆకస్మిక వరదలు కారణంగా 10 మంది గల్లంతయ్యారు. చాలా ఇళ్ళు కొట్టుకుపోయాయని తెలుస్తోంది.
ఉత్తరాఖండ్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. ఈ క్రమంలోనే మంగళవారం దెహ్రాదూన్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ట్రాక్టర్ నది దాటేందుకు ప్రయత్నిస్తుండగా వరద ఉద్ధృతి పెరగడంతో ప్రమాదవశాత్తు బోల్తాపడి కొట్టుకుపోయింది.
మంగళవారం తెల్లవారు ఝామున కురిసిన భారీ వర్షానికి ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ లో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. ఇళ్ళు, రోడ్లు కొట్టుకుపోయాయి. ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు.
ఉత్తరాఖండ్ లో మరోసారి కుంభవృష్టి కురిసింది. దీంతో మెరుపు వరదలు చమోలీ జిల్లా మెరుపు వరదల్లో మునిగిపోయింది. సగ్వారా గ్రామంలో ఒక యువతి చనిపోగా..పలువురు గల్లంతయ్యారు.
ఉత్తరాఖండ్ లోని ఉత్తర కాశీలో ఉన్నట్టుండి ముంచుకొచ్చిన వరదలపై వాతావరణశాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్లౌడ్ బరస్ట్ కు కారణమయ్యేంత వర్షపాతం అక్కడ నమోదు కాలేదని చెబుతున్నారు. దీనిపై మరింత పరిశోధన జరగాలని చెబుతున్నారు.
ఉత్తరకాశీ జిల్లా ధరాళి గ్రామంలో చోటుచేసుకున్న వరదల్లో కేరళకు చెందిన 28 మంది పర్యాటకులు గల్లంతైయ్యారు. గంగోత్రికి వెళ్లే మార్గంలో ధరాళి గ్రామం ఉంది. మంగళవారం మధ్యాహ్నం క్లౌడ్ బరస్ట్ సంభవించడంతో నదిలో నీటి మట్టం ఒక్కసారిగా పెరిగి గ్రామాన్ని ముంచెత్తింది.
ఉత్తరాఖండ్లోని ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఉండే ధరాలీ గ్రామం మెరుపు వరదలకు పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో నీరు, అక్కడున్న మట్టి కలిసి భారీ ఎత్తున బురద వరద ధరాలిని కప్పేసింది. గ్రామమంతా బురదలో చిక్కుకుపోయింది. ఆర్మీ,NDRF,SDRF బృందాలు రంగంలోకి దిగాయి.
వరుసగా 2 రోజు దేవాలయాల్లో తొక్కిసలాట చోటుచేసుకున్నాయి. ఉత్తరాఖండ్ హరిద్వార్లోని మానసా దేవి ఆలయంలో ఆదివారం జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించారు. కరెంట్ షాక్ పుకారే ఈ ఘోర విషాదానికి కారణమని అధికారులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.