Kedarnath Temple : కేదారనాథ్ యాత్రకు ముహూర్తం ఖరారు.

ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ హిమాలయాల్లో కొలువైన పవిత్ర కేదారనాథ్ ఆలయ ద్వారాలు భక్తుల దర్శనం కోసం ఏప్రిల్ 22న తెరుచుకోనున్నాయి. శీతాకాలం కారణంగా గత ఆరు నెలలుగా మూసి ఉన్న ఈ ఆలయాన్ని తిరిగి ప్రారంభించేందుకు

New Update
Kedarnath Temple

ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ హిమాలయాల్లో కొలువైన పవిత్ర కేదారనాథ్ ఆలయ ద్వారాలు భక్తుల దర్శనం కోసం ఏప్రిల్ 22న తెరుచుకోనున్నాయి. శీతాకాలం కారణంగా గత ఆరు నెలలుగా మూసి ఉన్న ఈ ఆలయాన్ని తిరిగి ప్రారంభించేందుకు శ్రీ బద్రీనాథ్-కేదారనాథ్ ఆలయ కమిటీ ముహూర్తాన్ని ఖరారు చేసింది. ఆదివారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని, కేదారనాథ్ స్వామి వారి శీతాకాల నివాసమైన ఓంకారేశ్వర్ ఆలయంలో పండితులు, అర్చకులు పంచాంగ రీత్యా లెక్కలు వేసి ఈ శుభ సమయాన్ని నిర్ణయించారు.

ఏప్రిల్ 22వ తేదీ ఉదయం 8 గంటలకు

సుమారు తొమ్మిదిన్నర క్వింటాళ్ల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన ఓంకారేశ్వర్ ఆలయంలో ప్రత్యేక పూజలు, అనుష్ఠానాల అనంతరం ఈ ప్రకటన వెలువడింది. ఏప్రిల్ 22వ తేదీ ఉదయం 8 గంటలకు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదారనాథ్ ఆలయ తలుపులు తెరుచుకుంటాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు రావల్ భీమాశంకర్ లింగ్, స్థానిక ఎమ్మెల్యే ఆశా నౌటియల్, ఆలయ కమిటీ ఛైర్మన్ హేమంత్ ద్వివేది సహా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. "జై బాబా కేదార్" నినాదాలతో ఆలయ ప్రాంగణం మారుమోగిపోగా, దాతలు ఏర్పాటు చేసిన అన్నదానంలో భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు.

కేదారనాథ్ ఆలయ ప్రారంభ తేదీ ఖరారు కావడంతో, గర్వాల్ హిమాలయాల్లోని ప్రసిద్ధ చార్ ధామ్ యాత్ర షెడ్యూల్ కూడా ఖరారైంది. అక్షయ తృతీయ రోజైన ఏప్రిల్ 19న గంగోత్రి, యమునోత్రి ఆలయాలు తెరుచుకోనుండగా, ఏప్రిల్ 23న బద్రీనాథ్ ధామ్ తలుపులు తెరుచుకుంటాయి. దీంతో ఏప్రిల్ మూడవ వారం నుంచి ఉత్తరాఖండ్‌లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది.

Also Read :  

Advertisment
తాజా కథనాలు