ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు
ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా.. 17 మంది గాయపడ్డారు. ఉత్తరాఖండ్లోని పౌరి గర్హ్వాల్ జిల్లాలో ఆదివారం యాక్సిటెంట్ జరిగింది. పోలీసులు, అధికారులు అక్కడకి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.