గంజాయి మత్తులో స్నేహితులు..| Tirupati Train Accident Today | Piler | RTV
ఇటీవల తమిళనాడులో కవరైపెట్టై రైల్వేస్టేషన్ దగ్గర మైసూరు -దర్భంగా భాగమతి ఎక్స్ప్రెస్.. గూడ్స్ రైలును ఢీకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే ప్రజలు వెంటనే తమను సంప్రదించాలని దక్షిణ రైల్వే సోషల్ మీడియా వేదికగా కోరింది.
సోషల్ మీడియా రీల్స్ పిచ్చితో రైలుపట్టాలపై స్టంట్ చేసిన ఓ కుటుంబం దుర్మరణం చెందింది. యూపీ లహర్పూర్కు చెందిన దంపతులు మహ్మద్ అహ్మద్, నజ్రీన్.. కొడుకు అబ్దుల్లాను లక్నో నుంచి మైలాన్ వెళ్తున్న ప్యాసింజర్ రైలు ఢీ కొట్టింది. శరీరాలు ఛిద్రమయ్యాయి.
మేడ్చల్ జిల్లా గౌడవెల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని తండ్రి, ఇద్దరు కుమార్తెలు మృతి చెందారు. చిన్నారులు రైల్వే ట్రాక్పై ఆడుకుంటుండగా ఒక్కసారిగా రైలు దూసుకొచ్చింది. వారిని కాపాడేందుకు తండ్రి పరిగెత్తుకు రాగా ఈ ప్రమాదం జరిగింది.
పశ్చిమ బెంగాల్ మాల్దాలోని కతిహార్ డివిజన్లోని కుమేద్పూర్ యార్డ్లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదం వల్ల రెండు రైళ్లను రద్దు చేయగా.. 6 రైళ్లను దారి మళ్లించారు రైల్వే అధికారులు. 4 రైళ్లను షార్ట్ టర్మినేట్ చేశారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ మధ్యకాలంలో వరుస రైలు ప్రమాదాలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఎన్నో కుటుంబాల్లో ఈ ప్రమాదాలు విషాదాన్ని నింపుతున్నాయి. ఒక్క జులై నెలలోనే వరుసగా ఆరు రైలు ప్రమాదాలు జరగడం ఆందోళన రేపుతోంది.
జార్ఖండ్లోని చక్రధర్పూర్ రైల్వే డివిజన్లోని బారాబంబో రైల్వే స్టేషన్ సమీపంలో హౌరా ముంబై మెయిల్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. రైల్వేలోని మూడు కోచ్లు పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ప్రమాదంలో 6 మందికి గాయాలైనట్లు సమాచారం.
ఆస్ట్రేలియాలో రైలు ఢీకొట్టడంతో భారతీయ టెకీ తో పాటు అతని కవలల కుమార్తెల్లో ఒకరు మృతి చెందారు.భారత్ కు చెందిన ఆనంద్ ఫ్యామిలీతో స్టేషన్లోని లిఫ్ట్ నుంచి బయటకు వస్తుండగా స్ట్రోలర్ ట్రాక్ పై పడింది.పిల్లల్నిరక్షించే క్రమంలో ఆనంద్ పట్టాలపైకి దూకగా ఈ ప్రమాదం జరిగింది.
రష్యాలోని కోమిలో ప్యాసింజర్ రైలు తొమ్మిది కోచ్ లు పట్టాలు తప్పడంతో 70 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ ప్రమాదంలో ఎంతమంది మరణించారో తెలియడం లేదు.