/rtv/media/media_files/2025/10/18/punjab-train-fire-accident-2025-10-18-09-41-46.jpg)
Punjab train Fire Accident
పంజాబ్లో ప్యాసింజర్ రైలులో మంటలు చెలరేగాయి. లూథియానా నుండి ఢిల్లీకి వెళ్తున్న అమృత్సర్-సహర్సా గరీబ్ రథ్ రైలులో మంటలు కలకలం రేపాయి. ఉదయం 7:30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రైలు సిర్హింద్ స్టేషన్ దాటిన వెంటనే కోచ్ నంబర్ 19 నుండి పొగలు రావడం ప్రారంభమైంది. దీంతో ప్రయాణికులు కేకలు వేయడంతో రైలు అంతటా భయాందోళనలు నెలకొన్నాయి. ఈ కోచ్లో అనేక మంది వ్యాపారవేత్తలు ఉండటంతో వారు గొలుసు లాగి రైలును ఆపినట్లు సమాచారం. దీంతో పైలట్ వెంటనే ప్రయాణికులందరినీ కిందికి దింపి ఈ విషయం గురించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.
Punjab train Fire Accident
पंजाब के सरहिंद रेलवे स्टेशन पर अमृतसर-सहरसा गरीब रथ एक्सप्रेस (ट्रेन संख्या 12204) के एक कोच में अचानक आग लग गई. घटना सुबह करीब 7:30 बजे की है. जैसे ही कोच से धुआं उठता देखा गया, रेलवे अधिकारियों ने तत्काल कार्रवाई करते हुए यात्रियों को अन्य कोचों में सुरक्षित शिफ्ट कर दिया.… pic.twitter.com/pbCdQbrEkK
— AajTak (@aajtak) October 18, 2025
#BREAKING Fire broke out in a coach of Train No. 12204 Amritsar–Saharsa at Sirhind Station, Punjab, around 7:30 AM. Railway authorities shifted passengers to other coaches and extinguished the fire. No casualties were reported: Indian Railways pic.twitter.com/dD5RjZ98qq
— IANS (@ians_india) October 18, 2025
సమాచారం అందుకున్న రైల్వే స్టేషన్ అధికారులు, సిబ్బంది, GRP, RPF, పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అనంతరం రైల్వే అధికారులు వెంటనే చర్యలు తీసుకుని ప్రయాణికులను ఇతర కోచ్లకు సురక్షితంగా తరలించారు. ఆపై ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేయడానికి విశ్వప్రయత్నాలు చేసి.. చివరికి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం ప్రయాణీకులందరూ సురక్షితంగా ఉన్నట్లు సమాచారం.
VIDEO | Sirhind, Punjab: A major train accident was averted near Sirhind railway station when a fire broke out in the Garib Rath Express travelling from Amritsar to Saharsa, just half a kilometre ahead of Ambala. The train was halted immediately after smoke was seen billowing… pic.twitter.com/vXwHoqTEJB
— Press Trust of India (@PTI_News) October 18, 2025
కాగా అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. రైల్వే ఇంజనీర్ల బృందం ఇప్పటికీ కారణాన్ని పరిశీలిస్తోంది. గందరగోళంలో రైలు దిగుతున్నప్పుడు అనేక మంది ప్రయాణికులు గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు వారికి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ వీడియోల్లో ప్రయాణీకులు తమ లగేజీని పట్టాలపై ఉంచుకుని నిలబడి ఉన్నట్లు కనిపిస్తున్నారు.
पंजाब–
— Sachin Gupta (@SachinGuptaUP) October 18, 2025
लुधियाना से दिल्ली जा रही गरीब रथ एक्सप्रेस के AC कोच में आग लगी। ट्रेन को सरहिंद स्टेशन के पास रोका गया। बचाव–राहत कार्य जारी है। pic.twitter.com/X8PWYAk45h
రైల్వే విడుదల చేసిన ఒక ప్రకటనలో.. TTE, రైలు పైలట్ మంటల గురించి రైల్వే కంట్రోల్ బోర్డుకు సమాచారం అందించారని, సమాచారం అందిన వెంటనే రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని తెలిపారు. ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని, కానీ రైలు దిగడానికి తొందరపడటంతో కొంతమంది గాయపడి చికిత్స పొందారని తెలిపారు.