దమ్ముంటే రా.. | Bilawal Bhutto Challenges PM Modi | India Pakistan War Updates | Shehbaz | RTV
సింధు జలాల నిలిపివేతతో పాకిస్తాన్ అల్లల్లాడుతోంది. కరువు కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. అందుకే ఈ విషయంలో భారత్ ను బతిమాలుతోంది. ఈ నిర్ణయాన్ని పున:పరిశీలించాలని పదేపదే అడుగుతోంది. దీనికి సంబంధించి నాలుగు లెటర్స్ ను రాసిందని తెలుస్తోంది.
ఆపరేషన్ సిందూర్లో నాలుగు రోజుల పాటు జరిగిన ఉద్రిక్త పరిస్థితులు అణుయుద్ధం స్థాయికి చేరుకోలేదని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) అనిల్ చౌహన్ అన్నారు. పాక్ ఆరు భారత యుద్ధ విమానాలు కూల్చేసిందని చేసిన వాదనలు అవాస్తవం అని తెలిపారు.
ఉగ్రవాదుల కంటే దుర్మర్గంగా వ్యవహరిస్తున్న ఇంటిదొంగలు ఒక్కరొక్కరే పట్టుబడుతున్నారు. తాజాగా భారత యుద్ధ నౌకల సమాచారం పాకిస్థానీ నిఘా ఏజెంట్లకు అందజేసిన మహారాష్ట్ర కు చెందిన యువకుడు రవీంద్ర వర్మను పోలీసులు అరెస్టు చేశారు.
ఆపరేషన్ సిందూర్లో పాకిస్థాన్లోని 118 పోస్టులను మన భద్రతా దళాలు ధ్వంసం చేశాయని అమిత్ షా అన్నారు. శత్రుదేశం కోలుకునేందుకు ఏళ్లు పడుతుందని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా జమ్మూకశ్మీర్లో పర్యటించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పాక్కు గూఢచర్యం చేస్తున్నారని సకూర్ ఖాన్ మగళియార్ను సీఐడీ, ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇతను కాంగ్రెస్ మాజీ మంత్రి సలేహ్ మహ్మద్ వ్యక్తిగత సహాయకుడిగా కూడా పని చేసినట్లు తెలుస్తోంది.
పహల్గాం లాంటి మరో ఉగ్రదాడి జరిగితే భారత్ తప్పకుండా స్పందిస్తుందని విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ అన్నారు. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని తెలిపారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ రాజీపడదన్నారు.
మహారాష్ట్ర కాంగ్రెస్ నేత విజయ్ వాడిట్టివార్ మీడియా సమావేశంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాక్ ప్రయోగించిన రూ.15 వేల చైనీస్ డ్రోన్లను కూల్చేందుకు రూ.15 లక్షల విలువైన క్షిపణులు ఎందుకు వాడారంటూ ప్రశ్నించారు.